Home » Kesineni Chinni
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గురువారం కలిశారు. ఈ సందర్భంగా సీఎంతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.
సిద్ధార్థ వైద్య కళాశాల వసతిగృహం భవనం నిర్మాణం పూర్తి చేయడంలో జగన్ చేతులెత్తేశారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. విద్యార్ధులకు ఉన్నత వైద్య విద్య, ఉత్తమ చికిత్స లక్ష్యంగా పీపీపీ విధానాన్ని ప్రభుత్వ అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. 78వ జాతీయ అంతర్ రాష్ట్ర, 87వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలను ఎంపీ ప్రారంభించారు.
మెడికల్ కాలేజీల అంశంపై లోక్సభలో వైసీపీకి ఎంపీ కేశినేని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ తమ వైఫల్యాలను దాచేందుకు, ఇప్పుడు పీపీపీ మోడల్ను వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు.
ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఆదివారం విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ శివనాథ్ పాల్గొన్నారు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ల మధ్య నెలకొన్న వివాదంపై తెలుగుదేశం పార్టీ హై కమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరు నేతలని పిలిపించి మాట్లాడింది.
టీడీపీ నేతలకి సంబంధించిన తిరువూరు విభేదాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ ఎవరు దాటినా సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
తిరువూరు టీడీపీ ఇష్యూపై తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పందించారు. తాను టీడీపీలో క్రమ శిక్షణగల నాయకుడినని కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు.
వైద్యులు కొన్ని రిక్వైర్మెంట్స్ అడిగారని.. వాటిని త్వరలోనే వాళ్లకు అందజేస్తామని ఎంపీ వెల్లడించారు. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.
ఏపీలో దొంగచాటుగా దొంగ మద్యం అమ్మించిన వైసీపీ మరో కొత్త డ్రామాకు తెరదీసిందని తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ధ్వజమెత్తారు. దొంగ మద్యంలో కేసులో వైసీపీ ముఖ్య నాయకుల్లో ఒక పేరు బయటికి వచ్చిందని చెప్పుకొచ్చారు ఎంపీ కేశినేని శివనాథ్.