Home » Kesineni Chinni
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికీ పెన్షన్ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ప్రజలకు స్వయంగా పెన్షన్లను అందజేశారు.
మాజీ ఎంపీ నానిపై తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సెటైర్లు వేశారు. తెలంగాణ ముఖ్యమంత్రికి నాని రాసిన లేఖపై చిన్ని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల పోషకాహారాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ‘బాలామృతం+’ని విజయవాడలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పురోగతిపై సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
ఏపీలో క్రికెట్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివనాథ్(చిన్ని) వ్యాఖ్యానించారు. ఐపీఎల్ తరహాలో తీసుకెళ్లడానికి ప్రభుత్వం, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ ఏర్పాట్లు చేస్తున్నాయని పేర్కొన్నారు.
మాజీ ఎంపీ కేశినేని నానిపై పోలీసు కేసు నమోదైంది. తనపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విశాఖ, కడప, మంగళగిరిలోని స్టేడియాల్లో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏ.పి.యల్) మ్యాచ్లు జరుగుతాయని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. జూన్ 30వ తేదీన మంగళగిరి వేదికగా జరిగే ఏ.పి.యల్ ఫైనల్ మ్యాచ్కు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హజరవుతారని తెలిపారు.
ఎంపీ కేశినేని శివనాథ్పై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎంపీపై సోషల్ మీడియాలో మాజీ ఎంపీ నాని, అతని అనుచరులు చేసిన దుష్ప్రచారంపై పోలీసులకు ఎంపీ చిన్ని కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) నివాళులు అర్పించారు. విజయవాడలోని తన కార్యాలయంతో పాటు, పటమట ఎన్టీఆర్ సర్కిల్లోని విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
ఇశాన్వీ, కేశినేని డెవలపర్స్ సoస్థలు కలిసి చేసిన రియల్ ఎస్టేట్ సంస్థకు ఈడీ అధికారుల నుంచి ఓ నోటీసు వచ్చిందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఆ కంపెనీకి వచ్చిన నోటీసుపై ఈనెల 27వ తేదీన వివరణ ఇస్తామని పేర్కొన్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ నోటీసులు ఇచ్చింది.