Home » Kesineni Chinni
ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఆదివారం విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ శివనాథ్ పాల్గొన్నారు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ల మధ్య నెలకొన్న వివాదంపై తెలుగుదేశం పార్టీ హై కమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరు నేతలని పిలిపించి మాట్లాడింది.
టీడీపీ నేతలకి సంబంధించిన తిరువూరు విభేదాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ ఎవరు దాటినా సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
తిరువూరు టీడీపీ ఇష్యూపై తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పందించారు. తాను టీడీపీలో క్రమ శిక్షణగల నాయకుడినని కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు.
వైద్యులు కొన్ని రిక్వైర్మెంట్స్ అడిగారని.. వాటిని త్వరలోనే వాళ్లకు అందజేస్తామని ఎంపీ వెల్లడించారు. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.
ఏపీలో దొంగచాటుగా దొంగ మద్యం అమ్మించిన వైసీపీ మరో కొత్త డ్రామాకు తెరదీసిందని తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ధ్వజమెత్తారు. దొంగ మద్యంలో కేసులో వైసీపీ ముఖ్య నాయకుల్లో ఒక పేరు బయటికి వచ్చిందని చెప్పుకొచ్చారు ఎంపీ కేశినేని శివనాథ్.
మూలా నక్షత్రం రోజైన నేడు రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
విజయవాడలో ఈనెల 27వ తేదీన ప్రత్యేక ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్కు సంబంధించిన ఏర్పాట్లపై నిర్వాహకులకు కేశినేని శివనాథ్ కీలక సూచనలు చేశారు.
విజయవాడ అభివృద్ధిని కొంతమంది వైసీపీ నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ధ్వజమెత్తారు. వైసీపీ చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేశినేని శివనాథ్ చెప్పుకొచ్చారు.
వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పాలన, కూటమి ప్రభుత్వంపై భూమన కరుణాకర్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.