Home » Kesineni Chinni
ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఎక్కువగా కూటమికే అవకాశాలు ఉన్నాయని.. పెద్ద ఎత్తున పోలింగ్ జరగడమే దీనికి సంకేతమని టీడీపీ నేతలు అంటున్నారు. విజయవాడ పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూటమి కైవనం చేసుకుంటుందని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని నేడు తెలిపారు.
Telangana: మైలవరం వీవీఆర్ జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రాలను తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని ) సందర్శించారు. ఈవీఎం మొరాయింపుపై ఏఆర్ఓ రాజేశ్వరరావుపై కేశినేని చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదని ఆరోపించారు. మైలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈవీఎంలు మొరాయించాయి.
ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కనీసం ఐదుగురు నుంచి 20 మంది వరకు పోటీలో ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో కొన్ని పోలింగ్ బూత్లలో రెండు ఈవీఎంలు ఏర్పాటు చేశారు. సాధారణంగా ఓటు వేసేటప్పుడు ఓటర్లు ఎక్కువమంది అభ్యర్థులు ఉండటంతో కన్ఫ్యూజ్ అవుతూఉంటారు. ఒకరికి వేద్దామని వెళ్లి మరొకరికి వేసే అవకాశం ఉంటుంది.
Andhrapradesh: ఏపీలో పోలింగ్ ప్రారంభమైంది. అయితే పలుచోట్ల ఈవీఎంల మొరాయింపులతో పోలింగ్ ఆలస్యమైంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ పోలింగ్ ప్రారంభంకాని పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ ఆలస్యం కారణంగా రాజకీయ నేతలు కూడా పోలింగ్ కేంద్రాల్లో వేచి ఉండాల్సి వస్తోంది. ఇటు టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఉదయం ఏడు గంటలకే ఓటు వేసేందుకు వచ్చారు.
అక్రమ ఆస్తులు, కేసులపై వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని సవాల్ విసిరారు. నేడు చిన్ని మీడియాతో మాట్లాడుతూ.. కేశినేని నాని అక్రమాలన్నింటినీ నిరూపిస్తానని.. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను ఆయన నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. కేశినేని నాని నోరు అదుపులో పెట్టుకో .. లేదంటే నీ అవినీతి, మోసాల చరిత్ర మొత్తం బయట పెడతానన్నారు.
బీజేపీ ప్రభుత్వం మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే మస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని.. వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Chinni) అన్నారు. ముస్లిం వర్గాలు కూడా సీఎం జగన్ను నమ్మే పరిస్థితిలో లేరని.. వారికి అన్ని విధాలా అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. నిన్న(బుధవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షోలో కూడా ముస్లింలు పెద్ద ఎత్తున తరలి వచ్చారని తెలిపారు.
కేశినేని చిన్ని (శివనాథ్ ) ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు క్యూలు కడుతున్నారు. ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి కృష్ణమోహన్ , కార్యవర్గంతో సహా ఐదు వందల మంది నేడు టీడీపీలో చేరారు. వారికి కేశినేని చిన్ని పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
Andhrapradesh: నగరంలోని భవన నిర్మాణ కార్మికులు బుధవారం ఉదయం సమావేశమయ్యారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని, టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పనులు లేక పస్తులు ఉన్న పరిస్థితి వివరిస్తూ కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. సీఎంగా జగన్ వచ్చాక భవన నిర్మాణ కార్మికులు కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: ఎన్నికలకు మరికొద్దిరోజులే ఉన్నప్పటికీ వైసీపీలో మాత్రం వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కేశినేని శివనాథ్(చిన్ని) ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ అధికార ప్రతినిధి ఏలేశ్వరపు జగన్మోహన్ రావు టీడీపీలో చేరారు.
Andhrapradesh: కూటమి పార్టీల అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని) తెలిపారు. ఉపాధి, ఉద్యోగాలు, అభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారన్నారు. ఐదేళ్లల్లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. గత ఐదేళ్లల్లో ఉద్యోగాలు లేక యువత భవిష్యత్తు నాశనం అయ్యిందని విమర్శించారు.