Home » Nandamuri Balakrishna
హిందూపురం వస్తే.. తన పుట్టింటికి వచ్చినట్లుగా ఉంటుందని రాష్ట్రమంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ సంస్థల ఈడీ నారా బ్రాహ్మణి అన్నారు. ఆమె హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు, విద్యర్థులు బ్రాహ్మణికి ఘనస్వాగతం పలికారు.
హిందూపురం అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే పలు కార్యక్రమాల్లో బాలయ్య పాల్గొన్నారు.
వందే భారత్ రైలు పది రోజుల్లోపు హిందూపురంలో ఆగుతుందని ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు. హిందూపురానికి వచ్చిన ఆయన విలేకరలుతో మాట్లాడారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తాను రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నతో మాట్లాడామని తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీకి రాకుండా బాలకృష్ణ గురించి మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు.
సినిమా నటులకు అవమానం జరిగిందని కామినేని శ్రీనివాస్ శాసనసభలో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదానికి మూలమైన కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులు, కటాక్షం అందరిపై ఉండాలని నటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. 46 రోజులపాటు ఎగ్జిబిషన్ కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. 11 రోజుల పాటు కనక దుర్గమ్మను వివిధ రూపాల్లో అలంకరిస్తారని వివరించారు.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా టికెట్ ధరలు పెంచడం వల్ల సగటు చిన్న నిర్మాతలు నష్టపోతున్నారని తెలుగు సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమేనని తెలిపారు. అలాంటి సినిమా టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతారని నారాయణ మూర్తి పేర్కొన్నారు.
హిందూపురం నియోజకవర్గంలో స్మాల్స్కేల్ ఇండస్ర్టీస్ హబ్ ఏర్పాటు చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాసులును ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లిని ఆయన చాంబర్లో ఎమ్మెల్యే కలిశారు.
విజయవాడలో ఈనెల 27వ తేదీన ప్రత్యేక ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్కు సంబంధించిన ఏర్పాట్లపై నిర్వాహకులకు కేశినేని శివనాథ్ కీలక సూచనలు చేశారు.
పదవులు ముఖ్యం కాదని... వాటికే తాను అలంకారమన్నది తన భావనని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉద్ఘాటించారు. మంచి ఉద్దేశంతో అఖండ- 2 మూవీ తీశామని చెప్పుకొచ్చారు. కులాలకు ఆపాదించకుండా హైందవ ధర్మానికి ప్రతిరూపంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని బాలకృష్ణ పేర్కొన్నారు.