Home » Nandamuri Balakrishna
అశ్వమేధం చిత్రం ద్వారా ఆశా భోంస్లేతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ప్రమఖ నటుడు, తెలుగుదేశం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. ఓపీ నయ్యర్, ఆర్.డి. బర్మన్తో కలిసి అద్భుతమైన ఎవర్గ్రీన్ పాటలు ఇచ్చారని తెలిపారు.
హైదరాబాద్లో అన్నవాహిక (ఈసోఫాగస్) క్యాన్సర్పై దృష్టి సారించిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. మాదాపూర్లోని ది వెస్టిన్ హోటల్లో జరిగిన ఈ సదస్సును ప్రముఖ నటుడు, టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్-రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో మంగళవారం ఏఐ ఆధారిత ఫీచర్లతో కూడిన అత్యాధునిక అల్ట్రా సౌండ్ యంత్రాన్ని ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈనెల 15న వందకుపైగా బహుళజాతి కంపెనీలతో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు.
హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం, తాగునీటి సమస్యల పరిష్కారంపై బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మోహన కృష్ణ కొనియాడారు.
అసెంబ్లీ లాబీలో పలువురు ఎమ్మెల్యేలతో నందమూరి బాలకృష్ణ సరదాగా సంభాషించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజును డాకూ మహారాజ్ అని పిలిచారు బాలయ్య.
నాన్న నందమూరి తారక రామారావు ఆదేశాల మేరకు బసవతారకం ఆస్పత్రిలో అన్ని రకాల సేవలు అందిస్తూ రోగులకు ఓదార్పునిస్తున్నామని బాలకృష్ణ తెలిపారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన చికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు..
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారత రాజ్యాంగంలోని ప్రతీ పదం వెనుక ప్రజల భవిష్యత్తు దాగుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
అనంతపురం జిల్లాలోని హిందూపురం వాసులకు గుడ్న్యూస్.. ఈనెల 27నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆగనుంది. యశ్వంత్పూర్ నుంచి కాచిగూడకు వెళ్లే వందేభారత్ రైలు.. 27వతేదీ నుంచి హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. దీంతో ఈ ఏరియా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
జిల్లా కేంద్రం అనంతపురంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ర్యాలీ నిర్వహించారు. అఖండ-2 సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయిన సందర్భాన్ని పురష్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. అటు బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.