Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కీలక నిర్ణయం: చైర్మన్ బీఆర్ నాయుడు
ABN, Publish Date - Nov 18 , 2025 | 09:38 PM
వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబ్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబ్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకు కేటాయిస్తామని తెలిపారు.
దీని వల్ల సామాన్య భక్తులకు మేలు జరుగుతుందని తెలిపారు.
మంగళవారం తిరుమలలో చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదటి మూడు రోజులు రూ. 300, శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు.
జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15 వేల రూ. 300 దర్శన టికెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్దతిలో కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు.
Updated Date - Nov 18 , 2025 | 09:55 PM