Balakrishna:హిందూపురంలో ఇళ్ల పట్టాల పంపిణీ.. పాల్గొన్న నందమూరి బాలకృష్ణ
ABN, Publish Date - May 06 , 2025 | 09:02 AM
హిందూపురంలో నందమూరి బాలకృష్ణ సోమవారం నాడు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అలాగే చిలమత్తూరు మండలంలోని టేకులోడులో డైనింగ్ హాల్ నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. బాలకృష్ణకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక నేతలతో సమావేశం అయ్యారు. వివిధ కార్యక్రమాలపై నేతలకు బాలకృష్ణ దిశానిర్దేశం చేశారు.
హిందూపురంలో నందమూరి బాలకృష్ణ సోమవారం నాడు పర్యటించారు.
నందమూరి బాలకృష్ణకు తెలుగుదేశం పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.
నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.
ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల పట్టాలను నందమూరి బాలకృష్ణ పంపిణీ చేశారు.
అలాగే చిలమత్తూరు మండలంలోని టేకులోడులో డైనింగ్ హాల్ నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది.
భూమి పూజ చేస్తున్న బాలకృష్ణ
స్థానిక నేతలతో నందమూరి బాలకృష్ణ సమావేశం అయ్యారు. వివిధ కార్యక్రమాలపై నేతలకు బాలకృష్ణ దిశానిర్దేశం చేశారు.
బాలకృష్ణతో బ్రాహ్మణులు భూమి పూజ చేశారు.
కూటమి ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరుగుతుందని బాలకృష్ణ తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు
చిన్నారులతో మాట్లాడుతన్న బాలకృష్ణ
బాలకృష్ణకు తమ సమస్యలు చెబుతున్న ప్రజలు
ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని బాలకృష్ణ ఆదేశించారు.
హిందూపురంలోని కన్యకా పరమేశ్వరి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు.
కన్యకా పరమేశ్వరి అమ్మవారికి హారతి ఇస్తున్న నందమూరి బాలకృష్ణ
హిందూపురంలో నందమూరి బాలకృష్ణ రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ గజమాలతో టీడీపీ నేతలు, అభిమానులు బాలకృష్ణను సన్మానించారు.
నందమూరి బాలకృష్ణతో ఫొటో దిగుతున్న టీడీపీ మహిళ నేతలు
నందమూరి బాలకృష్ణ సన్మానిస్తున్న టీడీపీ నేతలు, అభిమానులు
రాయలసీమ గడ్డ నా అడ్డా అని నందమూరి బాలకృష్ణ తెలిపారు.
టీడీపీ అంటే ఒక జవాబుదారి పార్టీగా పేరుగాంచిందని నందమూరి బాలకృష్ణ అన్నారు.
టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ వైసీపీ నేతలకు బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు .
ఏపీ సీఎం చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని నందమూరి బాలకృష్ణ కొనియాడారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే హిందూపురంలో రూ. 50 కోట్ల నిధులతో పనులు చేయించానని గుర్తుచేశారు.
Updated Date - May 13 , 2025 | 11:40 PM