Home » Hindupur
నెల్లూరు నగరంలో సీపీఎం నాయకుడు పెంచలయ్యను హత్యచేసిన గంజాయి బ్యాచను కఠినంగా శిక్షించాలని సీపీఎం, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. అంబేడ్కర్ సర్కిల్లో నిరసన తెలిపారు.
ఎయిడ్స్ రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి వెంకటేశ్వర్లునాయక్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.
హిందూపురం వస్తే.. తన పుట్టింటికి వచ్చినట్లుగా ఉంటుందని రాష్ట్రమంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ సంస్థల ఈడీ నారా బ్రాహ్మణి అన్నారు. ఆమె హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు, విద్యర్థులు బ్రాహ్మణికి ఘనస్వాగతం పలికారు.
సెల్ఫోన్.. మరో విద్యార్థిని ఊపిరితీసింది. ఫోన్ ఎక్కువగా చూడొద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా హిందూపురం సత్యనారాయణపేటలో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో 80 శాతం సబ్సిడీతో ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీఏ వీరయ్య అన్నారు. సోమవారం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద హిందూపురం కార్యాలయానికి చెందిన పలుశాఖల అధికారులతో ప్రజాదర్బార్ నిర్వహించారు.
కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ వెన్నంటే ఉంటుందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భరోసా ఇచ్చారు. సోమవారం పట్టణంలోని సాయితేజ, కల్యాణమండపంలో క్లస్టర్ యూనిట్ బూత ఇన్చార్జ్లతో సమావేశం అయ్యారు.
హిందూపురం అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే పలు కార్యక్రమాల్లో బాలయ్య పాల్గొన్నారు.
వందే భారత్ రైలు పది రోజుల్లోపు హిందూపురంలో ఆగుతుందని ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు. హిందూపురానికి వచ్చిన ఆయన విలేకరలుతో మాట్లాడారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తాను రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నతో మాట్లాడామని తెలిపారు.
దేవుడికి సేవ చేయాలన్నదే నా లక్ష్యమని సూగూరు ఆంజనేయస్వామి ఆలయ నూతన చైర్మన వైసీ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఆలయం వద్ద చైర్మన, కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ అధికారులు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.