Home » Hindupur
ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో ఇటీవల నాలుగు హత్యలు జరిగాయి.
పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం కిరికెరలో గురువారం జరిగింది.
జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్నిమాపక అధికారులు అగ్నిప్రమాదాల నివారణపై గురువారం పట్టణంలోని శ్రీకంఠపురంలో ప్రజలకు అవగాహన కల్పించారు.
పట్టణంలోని విద్యాసంస్థలు, పరిసర ప్రాంతాల్లో గురువారం ఈగల్ ప్రత్యేక టీ మ్ సభ్యులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బోయపేట, చిన్నమార్కెట్ ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థల ఏరియాల్లో చిల్లరకొట్లు, షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.
పట్టణంలోని మోడల్ కాలనీలో పేదలకు నాలుగు దశాబ్ధాల క్రితం ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించింది. అయితే వారికి ఇప్పటి వరకు పట్టాలు లేవు.
యశ్వంతపూర్-కాచిగూడ-యశ్వంతపూర్, కలబురగి-బెంగళూరు-కలబురగి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల వేళలను ఈనెల 15వ తేదీ నుంచి మార్పు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈనెల 15న వందకుపైగా బహుళజాతి కంపెనీలతో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు.
హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం, తాగునీటి సమస్యల పరిష్కారంపై బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మోహన కృష్ణ కొనియాడారు.
హిందూపురం - లేపాక్షి రహదారిలోని శ్రీకంఠపురం కట్టమీద సోమ వారం ఆటో బోల్తాపడి ఐదుగురికి గాయాలయ్యాయి. హిం దూపురం అప్గ్రేడ్ సీఐ ఆంజనేయులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని చౌళూరులో చంద్రమౌళేశ్వరి స్వామి బ్రహ్మరథోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయమే అర్చకులు స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు చేశారు.