Home » Hindupur
నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఎక్స్ వేదికగా చేసిన ట్విట్ వైరల్ అవుతుంది. నేను ఎటువైపు ఉన్నానంటూ ఎవరైనా అడిగితే.. ఖచ్చితంగా మా కుటుంబం వైపే ఉంటాను. ఏ విధమైన అంశాలు ఆశించకుండా మా మామయ్య గారికి విష్ చేస్తున్నానని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ( AP Elections 2024 ) వేళ ముఖ్య నేతలందరూ ప్రచారం ముమ్మరం చేశారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేపట్టారు.
అధికార వైసీపీలో నేతల రాజీనామా పర్వం కొనసాగుతోంది. తాజాగా వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్కు ఆయన లేఖ రాశారు.
అమరావతి: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మలివిడత శంఖారావం యాత్ర చేపడతారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. రాయలసీమలో టీడీపీ కేడర్ను సమాయత్తం చేయడానికి గురువారం, ఉమ్మడి అనంతపురం జిల్లా, హిందూపురం నుంచి యాత్రకు శ్రీకారం చుడతారని పార్టీ నేతలు తెలిపారు.
Andhrapradesh: టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర హిందూపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది. గురువారం ఉదయం హిందూపురం టౌన్ చేరుకున్న భువనేశ్వరికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ సీపీ నేతల ఆగడాలు శృతి మించుతున్నాయి. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అభివృద్ధి చేస్తే తామే చేయాలని, ఇతరులు చేయొద్దని అంటున్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఓ వైసీపీ నేత వేసిన సీసీ రోడ్డును తీసి వేయించాడు.
హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలంలో వైసీపీ నేత తిప్పన్న దౌర్జన్యం తాజాగా వెలుగు చూసింది. లేపాక్షి ఎస్సీ కాలనీలో టీడీపీ ఎంపీ నిధులతో సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. రోడ్డు వేస్తే తామే వేయాలని... ఎస్సీ కాలనీలో తమకు తెలియకుండా సిమెంట్ రోడ్డు వేస్తారా? అంటూ కాంట్రాక్టర్ను తిప్పన్న బెదిరిస్తున్నారు.
హిందూపూర్ ( Hindupur ) లో వైసీపీ ( YCP ) బోణీ కొట్టడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra Reddy ) అన్నారు. బుధవారం నాడు హిందూపూర్లో పర్యటించారు.
Andhrapradesh: హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఎఫెక్ట్ గార్మెంట్స్ పరిశ్రమలపై పడింది. ఇండస్ట్రియల్ ఏరియాలోని పరిశ్రమలకు సెలవు ప్రకటించి కార్మికులను సమావేశాలకు తరలించాలంటూ వైసీపీ నేతలు సూచించారు.
శ్రీ సత్యసాయి జిల్లా: హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటనలో పాన్ కేక్ తేవడం కోసం సత్యసాయి జిల్లా అధికారులు బెంగళూరుకు వెళ్లారు. మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారుల పర్యటన ఖర్చులపై మడకశిర ఎమ్మార్వో ముర్షావలి ఆవేదన వ్యక్తం చేశారు.