Karthika Masam Last Monday: కార్తీక మాసం ఆఖరి సోమవారం.. ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Nov 17 , 2025 | 05:43 PM
కార్తీక మాసం చివరి సోమవారం (నవంబర్ 17వ తేదీ) కావడంతో.. తిరుపతిలోని కపిల తీర్థం, దేవేంద్ర థియేటర్ పక్కనే ఉన్న శివాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే దేవాలయానికి భారీగా భక్తులు చేరుకున్నారు.
కార్తీక మాసం చివరి సోమవారం (నవంబర్ 17వ తేదీ) కావడంతో.. తిరుపతిలోని కపిల తీర్థం, దేవేంద్ర థియేటర్ పక్కనే ఉన్న శివాలయానికి భక్తులు పోటెత్తారు.
తెల్లవారుజామునే దేవాలయానికి భారీగా భక్తులు చేరుకున్నారు.
ఈ సందర్భంగా దేవాలయం ప్రాంగణంలో ఆవు నెయ్యితో దీపారాధన చేశారు. పరమ శివునికి ఆవు పాలతో అభిషేకం చేశారు.
రావి చెట్టు కింద ఉన్న జంట నాగులకు పాలభిషేకం చేసి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అగరబత్తులు వెలిగించి.. దూప దీపాన్ని నాగేంద్రుడుకి సమర్పించారు.
అయ్యప్పమాల వేసుకున్న స్వాములు సైతం కపిల తీర్థానికి సోమవారం తెల్లవారుజామునే చేరుకుని.. పుణ్య స్నానమాచరించారు.
చిన్నారులు సైతం స్వామి వారి మాల వేసుకున్నారు. ఆ తర్వాత వీరంతా స్వామి వారి భజనలో పాల్గొన్నారు.
కపిల తీర్థం ప్రాంతం అయ్యప్ప స్వామి వారి నామస్మరణలతో మార్మోగింది.
Updated Date - Nov 17 , 2025 | 06:25 PM