విశాఖ-కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీల శంకుస్థాపన కార్యక్రమం
ABN, Publish Date - Dec 12 , 2025 | 03:48 PM
విశాఖ- కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తోపాటు ఐటీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి దిగ్గజ ఐటీ కంపెనీ విశాఖలో అడుగుపెట్టటం చారిత్రాత్మక మైలురాయని మంత్రి లోకేష్ అన్నారు.
విశాఖ- కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తోపాటు ఐటీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి దిగ్గజ ఐటీ కంపెనీ విశాఖలో అడుగుపెట్టటం చారిత్రాత్మక మైలురాయన్నారు.
విజన్ వాస్తవ రూపం దాలిస్తే కాగ్నిజెంట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు మారతాయన్నారు.
2025లో దావోస్లో కాగ్నిజెంట్ను కలిసి విశాఖకు ఆహ్వానించామని, ఇప్పుడు మళ్లీ దావోస్కు వెళ్లకముందే ఆ సంస్థ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించిందని, నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిందని మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.
ప్రోత్సాహకంగా ఎకరా భూమిని 99 పైసలకు ఇస్తామని వారికి హామీ ఇచ్చామని, ఆ మేరకే వారికి భూమి ఇచ్చామని స్పష్టం చేశారు.
విశాఖపట్నం ఐటీ, జీసీసీ కేంద్రంగా మారుతుందని, విశాఖ ఎకనామిక్ రీజియన్ కూడా ఈ ప్రాంత అభివృద్ధిని మారుస్తుందని మంత్రి అన్నారు.
ఆర్సెలార్ మిట్టల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ ప్రాంతానికి వస్తోందని, ఐటీ కంపెనీలు, పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.
Updated Date - Dec 12 , 2025 | 03:59 PM