CM Chandrababu: గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Jul 19 , 2025 | 07:06 AM
అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాజధాని అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో శుక్రవారం నుంచి రెండు రోజులపాటు నిర్వహించే ‘గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్-2025’ను జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మిట్ని ప్రారంభించారు. గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో వివిధ కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సదస్సులో గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం, ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్తో విద్యుత్తు ఉత్పత్తికి ఉన్న అవకాశాల గురించి సీఎం చర్చించారు. ఈ సదస్సుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, సీఎస్ విజయానంద్, ఇంధన రంగానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
అమరావతి SRM యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో వివిధ కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు.
ఈ సదస్సులో గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం, ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్తో విద్యుత్తు ఉత్పత్తికి ఉన్న అవకాశాల గురించి సీఎం చంద్రబాబు చర్చించారు.
ఈ సదస్సుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, సీఎస్ విజయానంద్, ఇంధన రంగానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.
ఏపీని ‘గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ’గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
సమ్మిట్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు
గ్రీన్ హైడ్రోజన్కు గత పదేళ్లలో ప్రాధాన్యం ఏర్పడిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత విద్యుత్ అవసరాల కోసం 40శాతం మేర.. ఇతర దేశాలపై ఆధారపడుతున్నామని పేర్కొన్నారు.
ఏపీలో ఎకో సిస్టమ్ని ప్రారంభిస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 400 కేటీపీఏ హైడ్రోజన్ డిమాండ్ ఉందని.. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని వెల్లడించారు.
సీఎం చంద్రబాబుతో మాట్లాడుతున్న పలువురు ప్రముఖులు
Updated Date - Jul 19 , 2025 | 07:09 AM