ఉంగుటూరులో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
ABN, Publish Date - Dec 01 , 2025 | 12:49 PM
ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఏలూరు జిల్లా ఉంగుటూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు నాదెండ్ల మనోహర్ , కె. పార్థసారథి, జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులతోపాటు ఏలూరు జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.
ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఏలూరు జిల్లా ఉంగుటూరుకు విచ్చేశారు.
సీఎంకు మంత్రులు నాదెండ్ల మనోహర్ , కె. పార్థసారథి, జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులతోపాటు ఏలూరు జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.
ఉంగుటూరు మండలం గోపినాథపట్నం గ్రామానికి చెందిన నాగలక్ష్మీకి సీఎం చంద్రబాబు పింఛన్ అందజేయనున్నారు. గత కొంత కాలంగా ఆమె మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుంది.
ఆతర్వాత నల్లమాడలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. అలాగే గొల్లగూడెంలో పార్టీ కేడర్తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు.
Updated Date - Dec 01 , 2025 | 12:51 PM