Loksabha: లోక్సభలో రెండు కీలక బిల్లులకు ఆమోదం
ABN, Publish Date - Aug 11 , 2025 | 03:11 PM
ఢిల్లీ: లోక్సభ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభలో ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు.
ఢిల్లీ: లోక్సభ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభలో ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. లోక్సభలో ప్రవేశపెట్టిన యాంటీ డోపింగ్, స్పోర్ట్స్ బిల్లులపై చర్చల అనంతరం బిల్లులకు ఆమోదం తెలిపింది.
జాతీయ క్రీడా పరిపాలనా బిల్లు, జాతీయ యాంటీ-డోపింగ్ సవరణ బిల్లులను క్రీడాశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ఇవాళ(సోమవారం) సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లులపై మంత్రి మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత క్రీడల్లో జరిగిన అతిపెద్ద సంస్కరణజాతీయ క్రీడా పరిపాలన బిల్లు అని తెలిపారు. క్రీడాకారులు వైభవోపేతంగా వెలిగిపోవాలన్న ఉద్దేశంతో క్రీడా గవర్నెన్స్ బిల్లును తీసుకువచ్చినట్లు చెప్పారు. క్రీడా వ్యవహారాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశం కూడా ఉన్నట్లు లోక్సభకు వివరించారు.
యాంటీ డోపింగ్ బిల్లు కూడా నూతన చట్టమే అనే తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డోపింగ్ విధానాలను ఇది సమర్థిస్తుందని పేర్కొన్నారు. పారదర్శకంగా డోపింగ్ చర్యలు చేపట్టే విధంగా చూడనున్నట్లు చెప్పారు. చర్చల అనంతరం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లులు లోక్సభలో ఆమోదించబడ్డాయి.
వార్తలు కూడా చదవండి..
Updated Date - Aug 11 , 2025 | 05:19 PM