Sanjay Gandhi: కలకలం రేపుతోన్న సంజయ్ గాంధీ ఫ్లాష్బ్యాక్ పోస్ట్
ABN, Publish Date - Jul 10 , 2025 | 07:10 PM
కాంగ్రెస్ నాయకత్వంతో తనకున్న విభేదాలను మరింత పెంచే అవకాశం ఉన్న మరో చర్యకు ఉపక్రమించారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ శశి థరూర్. 1975లో ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి.. అప్పటి చర్యల్ని బహిర్గతం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ నాయకత్వంతో తనకున్న విభేదాలను మరింత పెంచే అవకాశం ఉన్న మరో చర్యకు ఉపక్రమించారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ శశి థరూర్. 1975లో ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితిపై ఒక వ్యాసం రాసిన ఆయన, అత్యవసర పరిస్థితి సమయంలో జరిగిన అతిక్రమణలను, వాటి నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు అంటూ తన అభిప్రాయాల్ని సదరు వ్యాసంలో వ్యక్తపరిచారు. అంతేకాదు, ఆ అతిక్రమణలను ఎలా తక్కువగా చూపించారో కూడా థరూర్ ఎత్తి చూపారు. ఇది తన పార్టీ సహచరులను లక్ష్యంగా చేసుకునేదిగా ఉండటం కాంగ్రెస్ పార్టీలో మరింత కలవర పాటుకు కారణమవుతోంది.
ఆ వ్యాసంలో.. భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ రోజులను కేవలం చీకటి అధ్యాయంగా మాత్రమే గుర్తుంచుకోకూడదన్న శశిథరూర్.. దాన్నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయన్నారు. ఎమర్జెన్సీ టైంలో సంజయ్ గాంధీ వ్యవహరించిన తీరును శశిథరూర్ బయటపెట్టారు. నాడు ఆయన బలవంతంగా జరిపించిన కుటుంబ నియంత్రణ (వాసెక్టమీ) ఆపరేషన్లను ఎవరూ మర్చిపోలేరన్నారు. 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు దాదాపు రెండేళ్ల పాటు దేశంలో విధించిన ఎమర్జెన్సీ కాలంలో అదుపులేని శక్తి నిరంకుశత్వం రాజ్యమేలిందన్నారు. ఆ తర్వాత సదరు చర్యల్ని ‘దురదృష్టకరంగా’ అభివర్ణించినప్పటికీ.. ఆ రోజులను ఎవరూ మర్చిపోలేరని థరూర్ రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
ఇన్కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్డేట్ ప్రక్రియ తప్పనిసరి
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 10 , 2025 | 08:12 PM