Home » Shashi Tharoor
గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని సరకు రవాణా నౌకపై యూఎస్ జరిపిన దాడిలో ముగ్గురు భారత సిబ్బంది మరణించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అమెరికా స్పందించిన తీరు దిగ్భ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ ఎంపీ, విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చైర్మన్ శశి థరూర్ మండిపడ్డారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని ప్రజలను కోరారు.
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్కు చేదు అనుభవం ఎదురైంది. మలప్పురం జిల్లాలో కొంతమంది జనం శశిథరూర్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఆయన సెక్యూరిటీ టీమ్లోని సభ్యుడిపై దాడి చేశారు.
ఇటీవల టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడికి తాను మామయ్యలాంటి వాడినని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ వెటరన్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి సొంత పార్టీపై విమర్శలు గుప్పించారు. పార్టీ సీనియర్ నేతలైన శశిథరూర్, జైరామ్ రమేష్, పవన్ ఖేరాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
నరవణే రాసిన పుస్తకం ప్రచురితం కాలేదని ప్రభుత్వం అభ్యంతరం చెప్పడానికి బదులుగా రాహుల్కు మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండాల్సి ఉందని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.
ఒక మలయాళీగా తనకు బడ్జెట్ సంతృప్తి కలిగించలేదని శశిథరూర్ అన్నారు. బడ్జెట్లో కేరళ ప్రస్తావనే లేకపోవడం తనను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు.
శశిథరూర్ ప్రస్తుతం లిటరరీ ఫెస్టివల్ కోసం దుబాయ్లో ఉన్నారు. సీపీఎం నేతలను కలుకున్నట్టు వస్తున్న వార్తలపై మీడియా ఈ సందర్భంగా ఆయనను ప్రశ్నించగా ఆయన సూటి సమాధానం దాటవేశారు.
కేరళ లిటరేచర్ ఫెస్టివల్ సందర్భంగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు శశిథరూర్ స్పందిస్తూ, ఆపరేషన్ సిందూర్ అంశలో తాను ఒక బలమైన నిర్ణయం తీసుకున్నానని, దానిపై తాను క్షమాపణ కోరనని తెలిపారు.
ఇండియా-చైనా మధ్య 1962లో జరిగిన యుద్ధాన్ని ప్రస్తావిస్తూ కొన్ని కేసుల్లో వారి (మోదీ ప్రభుత్వం) విమర్శలకు ఆధారాలుండవచ్చని, ఆ యుద్ధంలో చైనాపై ఓటమికి నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు కారణం కావచ్చని శశిథరూర్ అన్నారు.