PM Modi: ఉగ్రవాదుల దుష్టపన్నాగం ఎన్నటికీ నెరవేరదు.. పహల్గాం ఉగ్రదాడిపై మోదీ
ABN, Publish Date - Apr 22 , 2025 | 07:07 PM
ఉగ్రవాదంపై పోరాటానికి భారత్ కృతనిశ్చయాన్ని ఇలాంటి దుష్టశక్తుల పన్నాగాలు నీరుగార్చలేవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
న్యూఢిల్లీ: టూరిస్టులే లక్ష్యంగా జమ్మూకశ్మీర్లోని పహల్గాం (Pahalgam)లో జరిగిన ఉగ్రదాడిని (Terror Attack) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్రంగా ఖండించారు. ఈ దురాగతానికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతామని, ఎవరినీ విడిచిపెట్టే ప్రసకే లేదని అన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి భారత్ కృతనిశ్చయాన్ని ఇలాంటి దుష్టశక్తుల పన్నాగాలు నీరుగార్చలేవని అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
Terror Attack: టూరిస్టులే టార్గెట్గా ఉగ్రదాడి.. ముగ్గురు మృతి, మోదీ ఫోన్, ఘటనా స్థలికి అమిత్షా
దీనికి ముందు, సౌదీ పర్యటనలో ఉన్న మోదీ పహల్గాం ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్షాకు ఫోన్ చేశారు. దాడి ఘటన గురించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి భద్రతా పరిస్థితిని సమీక్షించాలని చెప్పారు.
ఇవి కూాడా చదవండి..
Mamata Banejee: మీ ఉద్యోగాలు, జీతాలు సేఫ్.. విధుల్లోకి చేరండి: మమత
Justice Surya Kant: న్యాయ వ్యవస్థపై ప్రతీ రోజూ దాడి జరుగుతోంది..
Updated Date - Apr 22 , 2025 | 08:23 PM