Home » terror attack
నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు జమ్మూకశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. పలువురు అనుమానితుల పోస్టర్లను ఢిల్లీలో పలు చోట్ల ఏర్పాటు చేశాయి. ప్రధానంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో వీటిని ఉంచారు.
పాకిస్థాన్లోని నార్త్ వెస్టర్న్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో పోలీస్ వ్యాన్ని టార్గెట్ చేసుకొని జరిపిన బాంబ్ బ్లాస్ట్ లో ఏడుగురు మృతి చెందారు. దానికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టోంకోలో ఓ మారుతీ కారులో తరలిస్తున్న 150 కేజీల అమ్మోనియం నైట్రేట్ను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు ఎంతో తెలివిగా ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు యూరియా బస్తాల్లో అమ్మోనియం నైట్రేట్ను తరలించడానికి ప్రయత్నించారు.
ఢిల్లీ కారు బాంబు బ్లాస్ట్ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు ఫరీదాబాద్ అల్ ఫలా యూనివర్సిటీకి చెందిన టెర్రిరిస్ట్ డాక్టర్ ముజమిల్ షకీల్ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఉమర్ గురించి పలు సంచలన విషయాలు బయటపెట్టాడు.
గత అక్టోబర్లో నౌగామ్లోని బన్పోరలో పోలీసులు, భద్రతా సిబ్బందిని బెదిరిస్తూ పోస్టర్లు వెలిసాయి. దీనిపై శ్రీనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితులందరూ హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్న వారిగా తేలింది. ఉగ్ర మూలాలు బయటపడ్డంతో దర్యాప్తు సంస్థలు పెద్ద ఎత్తున యూనివర్సిటీపై దృష్టి సారించాయి. కాలేజీ మూతపడే అవకాశం ఉందన్న ప్రచారం బాగా జరుగుతోంది.
ఢిల్లీ కారు బాంబు బ్లాస్ట్ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు ఉగ్ర డాక్టర్లు 2022లో తుర్కియేలో పర్యటించినట్లు అధికారులు గుర్తించారు. సిరియాకు చెందిన ఆపరేటీవ్తో ఆ ముగ్గురూ భేటీ అయినట్లు తేలింది.
ఎర్రకోట పేలుడుకు సంబంధించి జాతీయ దర్యాఫ్తు సంస్థ తాజాగా మరో కీలక అంశాన్ని వెల్లడించింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్-ఉన్-నబి ఎర్రకోట పార్కింగ్ లాట్లో ఉంచిన కారులోనే బాంబును తయారు చేసినట్టు షాకింగ్ విషయం బయటకు వచ్చింది.
అల్-ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సిద్ధిఖీని ఈడీ అరెస్ట్ చేసింది. మంగళవారం అరెస్ట్ చేసిన సిద్ధిఖీని ఈ రోజు సాకేత్ కోర్టులో ఈడీ హాజరు పరిచింది.
ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేల్చడానికి వారం రోజుల ముందు నబీ కశ్మీర్లోని పుల్వామాలో తన ఇంటికి వెళ్లి సోదరుడు జహూర్ ఇలాహాకి ఆ వీడియో ఉన్న మొబైల్ ఫోన్ ఇచ్చాడు. నబీ స్నేహితులు అరెస్ట్ అయిన తర్వాత అతడి సోదరుడు ఆ ఫోన్ను ఓ చెరువులోకి విసిరేశాడు