Home » terror attack
విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టుతో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్వర్క్ గుట్టురట్టయింది. ఇది కేవలం స్థానిక అంశం మాత్రమే కాక, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న భద్రతాపరమైన విషయమని పోలీసులు గుర్తించారు.
ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా మత ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో ఉగ్రమూకలు దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘావర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్లో ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి.
దక్షిణ థాయిలాండ్లోని ఓ పాఠశాలలో ముష్కరుడు రెచ్చిపోయాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి పదుల కొద్దీ ప్రాణాలు తీశాడు.
నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు జమ్మూకశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. పలువురు అనుమానితుల పోస్టర్లను ఢిల్లీలో పలు చోట్ల ఏర్పాటు చేశాయి. ప్రధానంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో వీటిని ఉంచారు.
పాకిస్థాన్లోని నార్త్ వెస్టర్న్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో పోలీస్ వ్యాన్ని టార్గెట్ చేసుకొని జరిపిన బాంబ్ బ్లాస్ట్ లో ఏడుగురు మృతి చెందారు. దానికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టోంకోలో ఓ మారుతీ కారులో తరలిస్తున్న 150 కేజీల అమ్మోనియం నైట్రేట్ను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు ఎంతో తెలివిగా ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు యూరియా బస్తాల్లో అమ్మోనియం నైట్రేట్ను తరలించడానికి ప్రయత్నించారు.
ఢిల్లీ కారు బాంబు బ్లాస్ట్ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు ఫరీదాబాద్ అల్ ఫలా యూనివర్సిటీకి చెందిన టెర్రిరిస్ట్ డాక్టర్ ముజమిల్ షకీల్ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఉమర్ గురించి పలు సంచలన విషయాలు బయటపెట్టాడు.
గత అక్టోబర్లో నౌగామ్లోని బన్పోరలో పోలీసులు, భద్రతా సిబ్బందిని బెదిరిస్తూ పోస్టర్లు వెలిసాయి. దీనిపై శ్రీనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితులందరూ హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్న వారిగా తేలింది. ఉగ్ర మూలాలు బయటపడ్డంతో దర్యాప్తు సంస్థలు పెద్ద ఎత్తున యూనివర్సిటీపై దృష్టి సారించాయి. కాలేజీ మూతపడే అవకాశం ఉందన్న ప్రచారం బాగా జరుగుతోంది.
ఢిల్లీ కారు బాంబు బ్లాస్ట్ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు ఉగ్ర డాక్టర్లు 2022లో తుర్కియేలో పర్యటించినట్లు అధికారులు గుర్తించారు. సిరియాకు చెందిన ఆపరేటీవ్తో ఆ ముగ్గురూ భేటీ అయినట్లు తేలింది.