Home » terror attack
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల భవనాలపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉండడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రదాడి జరగవచ్చన్న పక్కా సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బయో టెర్రరిజం కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కీలక ముందడుగు వేశారు. బహిరంగ ప్రదేశాల్లో విషప్రయోగం ద్వారా అమాయక ప్రజలను చంపాలని ప్లాన్ చేసిన నిందితులపై కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగి సరిగ్గా రేపటికి ఏడాది అవుతుంది. మొత్తం 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటన దేశంలో తీవ్ర ఆగ్రవేశాలను రేకెత్తించిన విషయం తెలిసిందే..
దేశంలో భారీ పేలుళ్ల ఉగ్రకుట్రను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు భగ్నం చేశారు. పేలుళ్లకు ప్రణాళికలు రచించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టుతో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్వర్క్ గుట్టురట్టయింది. ఇది కేవలం స్థానిక అంశం మాత్రమే కాక, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న భద్రతాపరమైన విషయమని పోలీసులు గుర్తించారు.
ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా మత ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో ఉగ్రమూకలు దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘావర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్లో ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి.
దక్షిణ థాయిలాండ్లోని ఓ పాఠశాలలో ముష్కరుడు రెచ్చిపోయాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి పదుల కొద్దీ ప్రాణాలు తీశాడు.
నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు జమ్మూకశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. పలువురు అనుమానితుల పోస్టర్లను ఢిల్లీలో పలు చోట్ల ఏర్పాటు చేశాయి. ప్రధానంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో వీటిని ఉంచారు.
పాకిస్థాన్లోని నార్త్ వెస్టర్న్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో పోలీస్ వ్యాన్ని టార్గెట్ చేసుకొని జరిపిన బాంబ్ బ్లాస్ట్ లో ఏడుగురు మృతి చెందారు. దానికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టోంకోలో ఓ మారుతీ కారులో తరలిస్తున్న 150 కేజీల అమ్మోనియం నైట్రేట్ను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు ఎంతో తెలివిగా ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు యూరియా బస్తాల్లో అమ్మోనియం నైట్రేట్ను తరలించడానికి ప్రయత్నించారు.