Home » terror attack
పాకిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కరాచీలోని గులిస్థాన్-ఎ-జౌహర్ ప్రాంతంలో ఉన్న సింధ్ రేంజర్స్ ప్రావిన్షియల్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని నిన్న (శనివారం) రాత్రి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన పేలుడు పదార్థాల కేసు నిందితుడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో రెండో నిందితుడు షేక్ మన్సూర్ అలియాస్ మహ్మద్ అలీ అలియాస్ విజయకుమార్పై విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అధికారులు ఛార్జ్షీట్ సమర్పించారు.
దేశంలోని పలు కీలక ప్రాంతాలలో భారీ ఉగ్ర దాడులకు వ్యూహం పన్నిన తొమ్మిది మంది ఉగ్రవాదుల అరెస్ట్ తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉగ్ర మూక వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐతో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కీలక పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
విజయవాడలో వెలుగుచూసిన ఈ టెర్రర్ లింక్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఇప్పటివరకు ఈ కేసులో విజయవాడకు చెందిన ముగ్గురితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
గతేడాది నవంబర్లో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో దాదాపు 11 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇది ఉగ్రవాద కుట్రలో భాగమని కేంద్ర సంస్థలు తేల్చాయి.
గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిపై నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 26 మందిని చంపడానికి ముందు ముగ్గురు ఉగ్రవాదులు చెట్టు కింద భోజనం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల భవనాలపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉండడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రదాడి జరగవచ్చన్న పక్కా సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బయో టెర్రరిజం కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కీలక ముందడుగు వేశారు. బహిరంగ ప్రదేశాల్లో విషప్రయోగం ద్వారా అమాయక ప్రజలను చంపాలని ప్లాన్ చేసిన నిందితులపై కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగి సరిగ్గా రేపటికి ఏడాది అవుతుంది. మొత్తం 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటన దేశంలో తీవ్ర ఆగ్రవేశాలను రేకెత్తించిన విషయం తెలిసిందే..
దేశంలో భారీ పేలుళ్ల ఉగ్రకుట్రను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు భగ్నం చేశారు. పేలుళ్లకు ప్రణాళికలు రచించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.