Home » Jammu and Kashmir
హిమాలయాల్లోని పవిత్ర అమర్నాథ్ గుహాలయ వార్షిక యాత్ర ఈ తెల్లవారుజామున అధికారికంగా ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్లోని బాల్తాల్, పహల్గాం జంట బేస్ క్యాంప్ల నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.
పవిత్ర హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువై ఉన్న హిమలింగ దర్శనం కోసం అమర్ నాథ్ యాత్ర షురూ అయింది. జమ్మూ- కశ్మీర్ లోని బల్తాల్ మార్గం ద్వారా ప్రయాణిస్తున్న అమర్నాథ్ యాత్రికుల మొదటి బృందానికి ఈ ఉదయం ఘన స్వాగతం లభించింది.
భారత్-పాక్ సరిహద్దుల్లో మరోసారి పాక్ వ్యక్తి పట్టుబడ్డాడు. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేసింది.
జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లా నౌషేరే సెక్టార్ పరిధిలో గ్రనేడ్ పేలి నలుగురు సైనికులు గాయపడ్డారు. వీరిలో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి కూడా ఉన్నారు.
జమ్ముకశ్మీర్లో ఏకకాలంలో భిన్న వాస్తవాలు ప్రతిబింబిస్తున్నాయి. ఎల్ఓసీకి అవతలి ప్రాంతం నిరసనలు, ఉద్రిక్తతలతో అట్టుడుకుతుండగా.. ఇవతలి ప్రాంతంలో మాత్రం జోజిలా టన్నెల్ పూర్తికావడంతో సందడి వాతావరణం నెలకొంది. నియంత్రణ రేఖతో విడిపోయిన రెండు కశ్మీర్ల గాథను ఓసారి పరిశీలిస్తే...
జమ్మూ కశ్మీర్లోని ఉరీ సెక్టార్ కమల్కోట్ ఆర్మీ క్యాంపులో ఘోర ప్రమాదం జరిగింది. గ్రనేడ్ పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు..
శ్రీనగర్ నుంచి లద్దాఖ్ వరకూ దాదాపు 441 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి (ఎన్హెచ్-1) ఉంది. శ్రీనగర్ నుంచి లద్దాఖ్ వెళ్లాలంటే 13వేలకు పైగా అడుగుల ఎత్తులో హిమాలయ పర్వత శిఖరాలను అధిగమిస్తూ, అత్యంత శీతల వాతావరణంలో....
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో పలుచోట్ల భద్రతా దళాలకు నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మందికి పైగా మరణించారు. 200 మంది గాయపడ్డారు.
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జూన్ 3న ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ చర్చ మొదలైంది. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం చిక్కుల్లో పడిందని, అంతర్గత కలహాలను పార్టీ ఎదుర్కొంటోందని, ఆ కారణంతోనే ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
ఆన్లైన్లో ప్రేమించిన అమ్మాయి కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్కు చెందిన ఓ యువకుడు భారత భూభాగంలోకి చొరబడ్డాడు. వెను వెంటనే భద్రతా దళాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి.