ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Narendra Modi: ఆ ఉగ్రవాద ముల్లును తొలగించాల్సిన సమయం వచ్చింది..

ABN, Publish Date - May 27 , 2025 | 02:07 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గుజరాత్ పర్యటన నేడు (మే 27, 2025న) రెండో రోజు కొనసాగుతోంది. గాంధీనగర్‌లోని రూ.5,536 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్థాన్ ఉగ్రవాదం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Narendra Modi

ఒక శరీరం ఎంత బలంగా ఉన్నా, ఒక ముల్లు గుచ్చుకుంటే ఎంతో నొప్పి కలుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) గుజరాత్ పర్యటన సందర్భంగా అన్నారు. పాకిస్థాన్ మద్దతుతో దేశంలోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదమే ఆ ముల్లు అని, దాన్ని తొలగించాల్సిన సమయం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. మే 27, 2025న గాంధీనగర్‌లో రూ. 5,536 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని.. దేశ భద్రత, అభివృద్ధి, సంస్కృతి, జాతీయ గౌరవం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని ప్రతి మూలలో దేశభక్తిని చూశానని, ఇది కేవలం గుజరాత్‌కు మాత్రమే పరిమితం కాదన్నారు. ప్రతి భారతీయుడి హృదయంలో ఉందని మోదీ పేర్కొన్నారు.


పాక్‌పై ఘాటు విమర్శలు

గుజరాత్ పర్యటనలో రెండో రోజు వడోదర, దాహోద్, భుజ్, అహ్మదాబాద్ వంటి ప్రాంతాలను సందర్శించిన తర్వాత మోదీ గాంధీనగర్‌లో పలు కార్యక్రమాలను ప్రారంభించారు. 1947 విభజన తర్వాత మొదలైన ఉగ్రవాద దాడులను గుర్తు చేసిన ఆయన, ‘ఆ రోజు ముజాహిదీన్‌ను అంతమొందించి, సర్దార్ పటేల్ సలహాను పాటించి ఉండి ఉంటే, ఈ 75 ఏళ్ల ఉగ్రవాద చక్రం మనకు కనిపించేది కాదు’ అన్నారు. పాకిస్థాన్ ఇప్పటికీ ఉగ్రవాదాన్ని ఒక ‘పరోక్ష యుద్ధం’గా వినియోగించుకుంటోందని, కానీ అది నిజానికి ఒక వ్యూహాత్మకమైన యుద్ధమేనన్నారు ప్రధాని మోదీ.


ఉగ్ర స్థావరాలపై భారత దాడులు..

ఇటీవలి కాలంలో జరిగిన భారత ఉగ్రవాద వ్యతిరేక చర్యల గురించి కూడా ప్రధాని వివరించారు. 22 నిమిషాల్లో భారత్ 9 పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇది కెమెరాల ముందే జరిగింది. ఇక రుజువుల కోసం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. శవపేటికలపై పాక్ జెండాలు పెట్టి, వారికి సెల్యూట్ చేయడం ద్వారా, వారు ఉగ్రవాదాన్ని తమ అధికారిక విధానంగా చెప్పుకున్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా దేశ భద్రతపై మౌనంగా ఉండకుండా, ధైర్యంగా ఎదుర్కొంటామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.


అభివృద్ధికి అంకితభావం

2014 మే 26న నేను ప్రధాని పదవిని స్వీకరించాను. అప్పటి భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానం. కానీ ప్రస్తుతం అది నాలుగో స్థానానికి చేరిందని మోదీ గుర్తు చేశారు. ప్రపంచమంతా కరోనా, ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక సంక్షోభాలు వంటి సవాళ్లను ఎదుర్కుంటున్నప్పటికీ భారతదేశం తన గమ్యాన్ని వదులుకోలేదని ఆయన అన్నారు. మన లక్ష్యం 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్. స్వాతంత్య్రం పొందిన 100 సంవత్సరాల సందర్భంగా, మన దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. శాంతియుత సహజీవనం భారత్ లక్ష్యమని, కానీ, ఆ శాంతిని సవాలు చేస్తే, భారతదేశం తక్షణమే స్పందిస్తుందని, ఇది వీరుల భూమి అని మోదీ వెల్లడించారు.


ఇవీ చదవండి:

గుంపులోకి దూసుకెళ్లిన కారు..47 మందికి గాయాలు..

సీక్రెట్ కోడ్ ట్రిక్స్.. సైబర్ నేరాలకు చెక్‌..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 27 , 2025 | 04:20 PM