Home » Gujarat
గుజరాత్లో ఉగ్రవాద నెట్వర్క్ ఏర్పాటు కోసం ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.. గుజరాత్, మధ్యప్రదేశ్లో 8 మందిని అరెస్ట్ చేసింది.
హిందూ వివాహ వ్యవస్థ విశిష్టతపై గుజరాత్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిందూ సంప్రదాయాల ప్రకారం 'సప్తపది' వంటి శాస్త్రోక్తమైన క్రతువులు, ఆచారాలు నిర్వహించకుండా కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందినంత మాత్రాన ఆ పెళ్లి చెల్లుబాటు కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఆన్లైన్ కోర్టు విచారణల సందర్భంగా అప్రమత్తత ఎంత అవసరమో మరోసారి గుర్తు చేసే ఘటన వెలుగులోకి వచ్చింది. వర్చువల్ హియరింగ్ జరుగుతున్న సమయంలో మైక్ ఆన్లో ఉందన్న విషయాన్ని గమనించకుండా ఓ గుజరాతీ న్యాయవాది చేసిన వ్యాఖ్యలు కోర్టు లైవ్ స్ట్రీమింగ్లో వినిపించడంతో వివాదానికి దారితీసింది.
హోం మంత్రి అమిత్ షా గుజరాత్లో భారత్ ట్యాక్సీ సేవలను ప్రారంభించారు. కోఆపరేటివ్ మోడల్లో డ్రైవర్లే భాగస్వాములుగా ఉండే ఈ యాప్ ప్రారంభం వేడుకల్లో హోం మంత్రి ప్రసంగిస్తూ ట్యాక్సీ సేవలు ప్రస్తుతం నిత్యావసరంగా మారాయని అన్నారు.
పటిష్ఠ భద్రతా చర్యల నడుమ ఎన్టీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ-నీట్ ప్రారంభ సమయంలో పలుచోట్ల స్వల్ప వివాదాలు చోటుచేసుకున్నాయి. హిజాబ్లు, కలవ దారాలతో పాటు ఓ అభ్యర్థి పాత అడ్మిట్ కార్డుతో వేరొక పరీక్ష కేంద్రానికి రావడం మున్నగునవి ఇందులో ఉన్నాయి.
దేశ విమానయాన చరిత్రలోనే అత్యంత ఘోరమైన అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి సరిగ్గా ఏడాది పూర్తైంది. నాటి ప్రమాదానికి ప్రత్యక్ష సాక్షిగా ఉండి.. ఏరోప్లేన్ బాయ్గా పేరొందిన ఆర్యన్ అనే యువకుడికి ఆనాటి భయాలు వెంటాడుతున్నాయట.
ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఓ యువకుడిని కాపాడటం కోసం ఓ పోలీస్ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఎంతో రిస్క్ తీసుకుని ఏడవ అంతస్తులో ఉన్న యువకుడి ఫ్లాట్లోకి వెళ్లాడు. ఆత్మహత్య చేసుకోకుండా అతడిని అడ్డుకున్నాడు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో.. గుజరాత్లోని ఖేడాకు చెందిన వృద్ధ దంపతులు రజినీకాంత్, పుష్ప బెన్ దర్జీ ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ ఇంగ్లాండ్లో ఉన్న తమ కుమారుడి దగ్గరకు వెళ్లడానికి విమానం ఎక్కారు. కొడుకును చూడకుండానే చనిపోయారు.
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపైన, కాంగ్రెస్ పార్టీపైనా గుజరాత్లోని సూరత్లో శుక్రవారంనాడు జరిగిన బహిరంగ సభలో ప్రధాన నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. దేశంలో కొందరు నిరాశావాదులు ఉన్నారనీ, 'అత్మనిర్భర్ భారత్' ప్రచారాన్ని, దేశ దృఢ సంకల్పన్ని విమర్శించడమే వీళ్లు పనిగా పెట్టుకున్నారని అన్నారు.
గుజరాత్-మహారాష్ట్ర హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో, ఒక బస్సులో మంటలు చెలరేగి ఏడుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు.