Rains: 19 వరకు మోస్తరు వర్షాలు..
ABN, Publish Date - Aug 15 , 2025 | 11:19 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో ఈ నెల 19వ తేది వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమ మధ్య, దానిని అనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది.
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో ఈ నెల 19వ తేది వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమ మధ్య, దానిని అనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది. ఇది ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశముంది.
అదే సమయంలో తమిళనాడు(Tamilnadu), దక్షిణాది రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. ఈ కారణంగా రాష్ట్రంలోని ఒకటి, రెండు ప్రాంతాలు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఈ నెల 19వ తేది వరకు ఉరుములు, మెరుపులు, గంటకు 50 కి.మీ ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. రాజధాని నగరం చెన్నై(Chennai)లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన చిరుత!
Read Latest Telangana News and National News
Updated Date - Aug 15 , 2025 | 11:19 AM