Home » IMD
నైరుతి రుతుపవనాల సీజన్ మొదలై రెండున్నర నెలలు అవుతోంది. జూన్, జూలై నెలల్లో సరైన వర్షాలు కురవలేదు. వరుస అల్పపీడనాలు ఏర్పడడంతో ఆగస్టులోనైనా పరిస్థితి మారుతుందని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ.. వారి ఆశలన్నీ ఆవిరవుతున్నాయి.
జలధార - జలహారతి ఇక నిరంతర కార్యక్రమమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
ఉత్తర ఒడిశా, నైరుతీ బంగాళాఖాతాన్ని అనుకుని అల్పపీడనం ఒకటి ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనిపైన ఉపరితల ఆవర్తనం మరోకటి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వెల్లడించారు.
ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండనుండగా, మిగిలిన ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడనున్నట్లు ఐఎండీ తెలిపింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు.
రానున్న మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగుపాటుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
భాగ్యనగరవాసులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ అలర్ట్ జారీ చేశారు. ఈరోజు రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని పేర్కొన్నారు.
నైరుతి రుతుపవనాల సీజన్లో తొలి రెండు నెలలు రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం నెలకొన్న పరిస్థితులు ఆగస్టు నెలలో కొంతవరకు మెరుగుపడనున్నాయి. ఈనెలలో ఉత్తర, దక్షిణకోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదుకానున్నది.
రాష్ట్రంలోని పండ్ల తోటలపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. రుతుపవన వర్షాలు కురవక, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టి నీటి తడులు అందించడం కష్టంగా మారుతోంది. పొడి వాతావరణం కారణంగా తోటలు ఎండుముఖం పడుతున్నాయి.
ఎల్నినో కారణంగా రాష్ట్రంలో జూలై చివరి వారం ప్రారంభమయ్యే వరకు కరువు పరిస్థితులు కనిపించాయి. ఇక వానకాలం సీజన్లో పంటలసాగు కష్టమేనని అంతా అనుకున్నారు. అన్ని జిల్లాల్లో అప్పటికే వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి కనిపించింది.