Home » Tamil Nadu
కట్టుకున్న భార్య కళ్ళెదుటే ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్(Bank Manager) ఉరేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సేలం జిల్లా తొలసంపట్టి సమీపంలో జరిగింది. ఓలైపట్టి గ్రామానికి చెందిన ఇళవరసన్ (38) ధర్మపురి జిల్లా పెన్నాగరంలో ఉన్న ఒక ప్రైవేటు బ్యాంకులో మేనేజరుగా పని చేస్తున్నారు.
ప్రధాని మోదీ మైనార్టీలను వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణా మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్(Former Governor of Telangana Tamilisai Soundarrajan) పేర్కొన్నారు.
వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం విశాఖపట్నం నుంచి చెన్నై ఎగ్మూర్(Visakhapatnam to Chennai Egmoor), బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
కేరళలో బర్డ్ఫ్లూ(Bird flu) కారణంగా కోళ్లు, బాతులు వందల సంఖ్యలో చనిపోవడంతో ఆ వ్యాధి రాష్ట్రంలో ప్రవేశించకుండా ఉండేందుకు 12 చోట్ల వెటర్నరీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
వేసవిలో ఎదురయ్యే కంటి సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్స్ క్లినికల్ సర్వీసెస్ రీజినల్ హెడ్ డాక్టర్ సౌందరి తెలిపారు. ఈ మేరకు వేసవిలో నేత్రాలకు ఎదురయ్యే సమస్యలను వివరిస్తూ తేలికపాటి చిట్కాలు పాటించాలని కోరారు.
చిత్తిరై మాసం పౌర్ణమిని భక్తులు కోలాహలంగా జరుపుకున్నారు. ఆ రోజున సూర్యాస్తమయం, చంద్రోదయం ఒకే సమయంలో కన్నియాకుమారి(Kanniyakumari)లో కనిపించే అపురూప దృశ్యం వీక్షించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు.
తమిళనాడులో అన్ని లోక్సభ స్థానాలకు తొలి దశలోనే అంటే.. ఏప్రిల్ 19వ తేదీన పోలింగ్ జరిగింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈవిఎమ్లతో పాటు వివిప్యాట్ మేషిన్లను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు.
రాష్ట్రంలోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయాల్లో ఉద్యోగాల కోసం పేర్లు నమోదుచేసుకున్న వారి సంఖ్య 54.25 లక్షలుందని రాష్ట్రప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది..
కేరళ రాష్ట్రంలో బర్డ్ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలపై నిఘా వేశారు. ముఖ్యంగా కేరళ నుంచి కోళ్ళ దానా, కోళ్ళ ఉత్పత్తులు, కోడిమాంసం, కోడిగుడ్లు వంటివి సరఫరా కాకుండా అడ్డుకుంటున్నారు. కేరళ రాష్ట్రంలోని ఆలప్పుళా జిల్లాలోని కుట్టనాడులో బర్డ్ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. ఈ కేసులు వచ్చిన కిలోమీటరు దూరంలోని కోళ్ళఫారాల్లో కోళ్ళతో పాటు కోళ్ళ ఉత్పత్తులను నిర్వీర్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఈ నెల 23వ తేదీ పౌర్ణమి సందర్భంగా తిరువణ్ణామలైలో గిరిప్రదక్షిణకు 25 లక్షల మంది భక్తులు రావొచ్చని జిల్లా యంత్రాంగంతో పాటు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తిరువణ్ణామలైకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం..