• Home » Tamil Nadu

Tamil Nadu

Governor RN Ravi: సనాతన ధర్మం నిర్మూలన పేరుతో భయాందోళనలు..

Governor RN Ravi: సనాతన ధర్మం నిర్మూలన పేరుతో భయాందోళనలు..

గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ కొందరు సమాజంలోని ప్రజల మధ్య భయాందోళనలు రేకెత్తిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలాలు మారేకొద్దీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ తమిళనాడు రాష్ట్రంలో కొందరు మాట్లాడుతున్నారంటూ ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర సంచలనానికి దారితీశాయి..

Water ATM: ఊటీలో.. ‘వాటర్‌ ఏటీఎం’ ఏర్పాటు

Water ATM: ఊటీలో.. ‘వాటర్‌ ఏటీఎం’ ఏర్పాటు

తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రదేశం అయిన ఊటీలో వాటర్‌ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు ప్రదేశాల్లో ఈ వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఊటీలో ప్లాస్టిక్‏ను పూర్తిగా నిషేధించారు. వాటర్ బాటిళ్లు ఎక్కడా కనిపించవు. అయితే.. పర్యాటకుల కోసం ఈ వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు.

Heavy Rains: ఇంకా.. జలదిగ్బంధంలో శివారు ప్రాంతాలు

Heavy Rains: ఇంకా.. జలదిగ్బంధంలో శివారు ప్రాంతాలు

చెన్నై శివారు ప్రాంతాలన్నీ.. ఇంకా.. జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ‘దిత్వా’ తుఫాను వల్ల రాజధాని చెన్నైతోపాటు శివారు ప్రాంతాలన్నీ తడిసి ముద్దయిపోయాయి. తుపాన్ వల్ల జనజీవనం ఎక్కడికక్కడే స్థంభించిపోయింది. ప్రజానీకం ఇళ్లనుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

Tamilnadu Assembly Elections: స్టాలిన్‌ను కలిసిన  కాంగ్రెస్ కమిటీ.. డీఎంకేతో సీట్ల పంపకాల చర్చలు షురూ

Tamilnadu Assembly Elections: స్టాలిన్‌ను కలిసిన కాంగ్రెస్ కమిటీ.. డీఎంకేతో సీట్ల పంపకాల చర్చలు షురూ

సమావేశానంతరం సెల్వపెరుంతగై మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని గిరీష్ కలవడంతో అన్ని ఊహాగానాలకు తెరపడినట్టేనని చెప్పారు. కాంగ్రెస్, డీఎంకే మధ్య పటిష్టమైన పొత్తు ఉందని, కలిసికట్టుగా గతంలో ఐదు ఎన్నికలు గెలిచామని చెప్పారు. తమది 'విన్నింగ్ అలయెన్స్' అని అభివర్ణించారు.

N Raghuveera Reddy: రఘువీరా పిలుపు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేద్దాం

N Raghuveera Reddy: రఘువీరా పిలుపు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేద్దాం

తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేచయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్‌ కమిటీ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.

Southern Railway: అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే విజ్ఞప్తి.. బోగీల్లో హారతులివ్వొద్దు

Southern Railway: అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే విజ్ఞప్తి.. బోగీల్లో హారతులివ్వొద్దు

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే ఓ సూచన చేసింది. బోగీల్లో కర్పూర హారతులు ఇవ్వరాదని కోరింది. ఈ కర్పూర హారతుల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కావున కర్పూర హారతులు ఇవ్వవద్దని కోరింది.

BJP State Chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆసక్తికర కామెంట్స్.. అధికారంలోకి వచ్చేది అన్నాడీఎంకేనే..

BJP State Chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆసక్తికర కామెంట్స్.. అధికారంలోకి వచ్చేది అన్నాడీఎంకేనే..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరికొద్దిరోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది అన్నాడీఎంకే పార్టీనేనని ఆయన అన్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడాలని తాము ఆశిస్తున్నామన్నారు.

Speaker Sevam: విజయ్‌ రోడ్‌షోకు అనుమతి నిరాకరణ

Speaker Sevam: విజయ్‌ రోడ్‌షోకు అనుమతి నిరాకరణ

అగ్రహీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ పుదుచ్చేరిలో నిర్వహించతలపెట్టిన రోడ్‌షోలకు అనుమతి ఇవ్వలేమంటూ.. పోలీస్ శాఖ పేర్కొంది. చిన్ననగరమైన పుదుచ్చేరిలో రోడ్‌షో నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, తమిళనాడులో లాగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ పోలీస్ శాఖ పేర్కొంది.

Heavy Rains: ఆగని వర్షం.. స్తంభించిన జనజీవనం

Heavy Rains: ఆగని వర్షం.. స్తంభించిన జనజీవనం

రాజధాని చెన్నై నగరం తడిసి ముద్దవుతోంది. ఒకరోజు మొత్తం వర్షం విపరీతంగా కురవడంతో జనజీవనం అతలాకుతమైంది. ‘దిత్వా’ తుఫాన్‌ తీరందాటకుండానే బలహీనపడుతుండటంతో నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కాగా.. వర్షం కారణంగా మంగళవారం చెన్నై సహా 4 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

Tamil Nadu Crime Incident: భార్యను చంపి వాట్సాప్‌లో 'సెల్ఫీ' పోస్ట్ చేసిన భర్త

Tamil Nadu Crime Incident: భార్యను చంపి వాట్సాప్‌లో 'సెల్ఫీ' పోస్ట్ చేసిన భర్త

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు ఓ భర్త. అంతేకాక ఆమె శవంతో సెల్ఫీ దిగి..వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి