Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 5 జిల్లాల్లో భారీ వర్షాలు
ABN, Publish Date - Aug 12 , 2025 | 12:36 PM
వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్రిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. ఈ విషయమై వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
- వాతావరణ పరిశోధన కేంద్రం
చెన్నై: వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్రిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. ఈ విషయమై వాతావరణ కేంద్రం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో... ఉత్తరాంధ్ర, పరిసర ప్రాంతాల్లో వాతావరణ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, 13న వాయువ్య, దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది.
ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న 48 గంటల్లో ఉత్తర, దక్షిణ తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. అదే సమయంలో, తిరువళ్లూర్, రాణిపేట, వేలూరు, తిరుపత్తూర్, నీలగిరి జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాముందని, రాజధాని నగరం చెన్నైలో ఆకాశం మేఘావృతంగా ఉంటూ కొన్ని ప్రాంతాల్లో
ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. నైరుతి , ఉత్తర బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ తీరం, పశ్చిమ-మధ్య అరేబియా సముద్రంలోని పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశముందని, అందువల్ల మంగళవారం నుంచి ఈనెల 15వ తేది వరకు జాలర్లు ఆ ప్రాంతాలకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధరలు.. కానీ వెండి మాత్రం..
చట్టాలు తెలుసుకుని అమెరికా రండి
Read Latest Telangana News and National News
Updated Date - Aug 12 , 2025 | 12:36 PM