ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India-US 6th Round Trade Talks: భారత్-అమెరికా మధ్య జరగాల్సిన ఆరో విడత వాణిజ్య చర్చలు వాయిదా తప్పదా

ABN, Publish Date - Aug 17 , 2025 | 12:56 PM

భారత్– అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) చర్చల గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 25 నుంచి 29 వరకు ఆరో రౌండ్ చర్చల కోసం అమెరికా బృందం ఇండియా రావాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం రావడం లేదని తెలుస్తోంది.

India-US 6th Round Trade Talks

భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) కోసం చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఆర్థిక సంబంధాలను మెరుగుపరచడానికి ఉద్దేశించింది. ఇప్పటికే ఐదు రౌండ్ల చర్చలు పూర్తయ్యాయి, ఆగస్టు 25 నుంచి 29 వరకు ఆరో రౌండ్ చర్చల కోసం అమెరికా బృందం భారత్‌కు రావాల్సి ఉంది (India-US 6th Round Trade Talks). కానీ, తాజా నివేదికల ప్రకారం ఈ సందర్శన వాయిదా పడే అవకాశం ఉందట.

ఎందుకు వాయిదా ?

ఓ అధికారి తన పేరు వెల్లడించకుండా ఈ సందర్శన మళ్లీ షెడ్యూల్ చేయబడే అవకాశం ఉందని మీడియాకు తెలిపారు. అంటే, ఇప్పట్లో ఈ చర్చలు జరిగేలా లేవని తెలుస్తోంది. ఈ వాయిదా వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్‌పై 50 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ఇందులో 25 శాతం అదనపు సుంకాలు భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో విధించబడ్డాయి. ఈ ప్రకటన రెండు దేశాల మధ్య చర్చలకు కొంత ఒత్తిడిని తెచ్చినట్లు కనిపిస్తోంది.

అమెరికా మాత్రం..

అమెరికా భారత్‌లో డైరీ, వ్యవసాయ రంగాల్లో తమ ఉత్పత్తులకు మరింత మార్కెట్ యాక్సెస్ కావాలని కోరుతోంది. కానీ, ఈ రంగాలు భారత్‌లో చాలా సున్నితమైనవి. భారత ప్రభుత్వం మాత్రం రైతులు, పశుపోషకుల ప్రయోజనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని స్పష్టం చేసింది. ఎందుకంటే ఈ రంగాలు చిన్న, సన్నకారు రైతుల జీవనాధారానికి ముడిపడి ఉన్నాయి. అందుకే, అమెరికా డిమాండ్లను అంగీకరించడం భారత్‌కు అంత ఈజీ కాదు.

వారి లక్ష్యం ఏంటి?

భారత్, అమెరికా రెండూ కలిసి 2030 నాటికి తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని ప్లాన్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వాణిజ్యం 191 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. అంటే, దాదాపు రెట్టింపు కంటే ఎక్కువగా పెంచాలన్నమాట. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చాలా కీలకం. భారత్ తన రైతుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి పట్టుబడుతోంది. అదే సమయంలో అమెరికా తమ వాణిజ్య లక్ష్యాలను సాధించాలని చూస్తోంది. ఈ రెండు లక్ష్యాల మధ్య బ్యాలెన్స్ కుదిరేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 12:56 PM