Home » America
ఒకవైపు ఇరాన్తో అణు చర్చలు జరుపుతూనే.. అమెరికా మధ్యప్రాచ్య ప్రాంతంలో తన సైనికశక్తిని విపరీతంగా పెంచుతోంది. గత 24 గంటల్లోనే 50కి పైగా ఫైటర్ జెట్లను ఈ ప్రాంతానికి తరలించినట్లు అధికారిక వర్గాలు, ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ఆధారంగా తెలుస్తోంది.
అమెరికాకు వచ్చే విదేశీయులు జాగ్రత్తగా ఉండాలని మంత్రి మార్కో రూబియో హెచ్చరించారు. అమెరికా వ్యతిరేక చర్యలకు దిగితే వారి వీసాలను వెనక్కు తీసుకుంటామని హెచ్చరించారు.
అమెరికాతో రాజీకి సిద్ధమేనని ఇరాన్ సంకేతాలిచ్చింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో అదృశ్యమైన కర్ణాటక విద్యార్థి సాకేత్ ఉదంతం విషాదాంతమైంది. అతడి మృతదేహాన్ని తాజాగా స్థానిక పోలీసులు గుర్తించినట్టు భారతీయ రాయబార కార్యాలయం ఆదివారం ఎక్స్ వేదికగా వెల్లడించింది.
హిందువు అనుకుని సిక్కు యువకుడిపై దాడి చేసిన వైనం అమెరికాలోని శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీలో ఇటీవల వెలుగు చూసింది. ఈ ఘటనను అమెరికాలోని హిందూ సంఘాలు ఖండించాయి.
అమెరికాలో భారత్కు చెందిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఐఐటీ మద్రాస్లో గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించిన అతడు.. మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు కాలిఫోర్నియాకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో అతడిలా అదృశ్యమవ్వడం చర్చనీయాంశమైంది.
ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌకను కరేబియన్ సముద్రం నుంచి మధ్యప్రాచ్యానికి అమెరికా తరలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొద్ది వారాలుగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పాక్ ఆక్రమిత కశ్మీర్, అక్సాయ్ చిన్తో సహా జమ్మూ కశ్మీర్, లడఖ్ మొత్తం ప్రాంతాన్ని భారత భూ భాగంగా చూపించే భారతదేశ మ్యాప్ను అమెరికా వాణిజ్య ప్రతినిధి విడుదల చేశారు. ఈ మ్యాప్ పాకిస్థాన్ నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందట.
భారీగా పెంచిన హెచ్-1బీ ఫీజు నుంచి విదేశీ డాక్టర్లకు కొంత మేరకైనా ఉపశమనం కలిగించాలంటూ అమెరికాకు చెందిన 100 మంది చట్టసభ సభ్యులు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీకి లేఖ రాశారు. ఈ లేఖకు అమెరికన్ హాస్పిటల్ అసోసియేషన్ కూడా మద్దతు తెలిపింది.
2023లో రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న పోలీసు కారు ఢీకొని మరణించిన భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత జాహ్నవి కందులకు న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళితే..