Home » America
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోవడం వెనుక అమెరికా హస్తముందని ఆరోపణలు వచ్చిన వేళ అగ్రరాజ్యం స్పందించింది. పాకిస్థాన్ రాజకీయాలు పూర్తిగా ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయమని తేల్చి చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తెలుగు ప్రజల ఆశలసౌధమని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. అమెరికాలోని మేరీల్యాండ్లో శ్రీనాథ్రావుల అధ్యక్షతన ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది.
ఇరాన్పై జరగాల్సిన సైనిక దాడిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గల్ఫ్ దేశాల నేతల విజ్ఞప్తి మేరకు దౌత్య చర్చలకు మరికొంత సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇద్దరు యువకులు మసీదు, స్కూలు వద్ద కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అమెరికాలోని ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ శాండియాగోలో సోమవారం చోటుచేసుకుంది.
రష్యా ముడి చమురుపై అమెరికా మరోసారి ఆంక్షల సడలింపును జూన్ 17 వరకు పొడిగించింది. అయితే, ఈ నిర్ణయం తమ చమురు కొనుగోళ్లపై ఎలాంటి ప్రభావం చూపదని భారత్ స్పష్టం చేసింది.
రష్యా చమురు కొనుగోళ్లపై భారత్తో పాటు పలు దేశాలకు గతంలో ఇచ్చిన తాత్కాలిక సడలింపుల గడువు(మే 16)ను పెంచకూడదని ట్రంప్ నిర్ణయించారు. అయితే, దేశీయ ప్రయోజనాలే పరమావధిగా రష్యా నుంచి చమురు దిగుమతులను మునుపటిలాగే కొనసాగిస్తామని భారత్ తేల్చిచెప్పింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) గోల్డెన్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలోని 50 నగరాల్లో 50 రహదారులను దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ, పరిశుభ్రత, పరిరక్షణ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తానా చేపట్టింది.
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన 24 ఏళ్ల నవ్య, శనివారం రాత్రి అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది.
యుద్ధ విమానాల ఎయిర్ షో సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. రెండు యుద్ధ విమానాలు గాల్లో ఢీకొట్టుకుని ధ్వంసం అయ్యాయి. ఆదివారం అమెరికా, ఇడాహోలోని మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. భారీ మూల్యం తప్పదని భారత్కు హెచ్చరికలు సైతం జారీ చేసింది. పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తామని స్పష్టం చేసింది.