Home » Business news
ఐటీ నియామకాల కోసం ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకు గుడ్న్యూస్ వచ్చింది. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) కొత్త ఉద్యోగుల (ఫ్రెషర్స్) నియమాకాలను చేపట్టబోతోంది. నింజా(Ninja), డిజిటల్ (Digital), ప్రైమ్ (Prime) కేటగిరీల కోసం ఈ నియామకాలను ప్రారంభించనుందని ‘మనీ కంట్రోల్’ కథనం పేర్కొంది. గతేడాది మార్కెట్లో పెద్దగా డిమాండ్ లేకపోవడంతో కొత్తవారిని తీసుకోని టీసీఎస్.. ఈ ఏడాది ఫ్రెషర్లను తీసుకోబోతోందని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇంకా కొన్ని రోజులు మాత్రమే(march 31st) మిగిలి ఉంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మార్చి 31 వరకు ఉండే అనేక రకాల ఆర్థిక లావాదేవీల గడువు గురించి ఇప్పుడు చుద్దాం. ఈ నెలలో పరిష్కరించుకునే ప్రధాన అంశాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మధ్య చాయ్ పే చర్చ సందర్భంగా పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీలో ప్రధాన అంశం సాంకేతికత కాగా దీంతో పాటు విద్య, ఆరోగ్యం, వ్యవసాయం తదితర అంశాలు కూడా ఈ చర్చలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. అయితే వీడియోలో వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
యాక్సిస్ బ్యాంక్(axis bank)కు చెందిన చాలా మంది క్రెడిట్ కార్డ్ హోల్డర్లు(credit card users) విదేశాల్లో లావాదేవీల(overseas transactions) సమయంలో మోసానికి గురయ్యారు. ఆ క్రమంలో ఒక్కరోజులోనే దాదాపు రూ.500 కోట్లు కోల్పోయారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ. దేశంలో అత్యంత సంపన్నులైన పారిశ్రామికవేత్తలు. ఇద్దరూ గుజరాతీలు. ఇప్పుడు వీరిద్దరూ చేతులు కలిపారు...
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) గురువారం(మార్చి 28న) ఫుల్ జోష్తో కొనసాగుతున్నాయి. స్టాక్ మార్కెట్లో విపరీతమైన కొనుగోళ్ల కారణంగా మార్కెట్లోని ప్రధాన సూచీలు గ్రీన్లో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటి గంటకు సెన్సెక్స్(sensex) 927 పాయింట్ల లాభంతో 73876 దగ్గర ట్రేడైంది.
ఇటివల ఆసియా(Asia)లోనే 50 బెస్ట్ రెస్టారెంట్ల(restaurants) 2024 జాబితాను విడుదల చేశారు. వాటిలో భారత్ నుంచి మూడు రెస్టారెంట్లు చోటు దక్కించుకున్నాయి. సియోల్లో జరిగిన వేడుకలో ఉత్తమ రెస్టారెంట్ల 12వ ఎడిషన్ జాబితాను రిలీజ్ చేసిన క్రమంలో పేర్కొన్నారు.
మీరు ఇంకా మీ పాన్ కార్డ్ని ఆధార్ కార్డుతో లింక్ చేయలేదా? అయితే వెంటనే చేసేయండి. ఎందుకంటే మార్చి 31 వరకు మాత్రమే ఉచితంగా లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత చేసుకోవాలంటే మాత్రం మీరు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
భవిష్యత్తు అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టారా.. ఇప్పటికే యుటిలిటీ బిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్ సమర్పించి కేవైసీ పూర్తి చేశారా.. అయితే మీరంతా మరోసారి తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవల్సిందే. దీనికి సంబంధించి కేఫిన్టెక్, క్యామ్స్ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందించింది.
ప్రపంచంలో బిలియనీర్లు జాబితాను హరున్ గ్లోబల్ రిచ్ విడుదల చేసింది. ఆ జాబితాలో భారతదేశానికి చెందిన ఐదు నగరాలు చోటు దక్కించుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కూడా ఆ జాబితాలో ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అత్యధింకగా 92 మంది బిలియనీర్లు ఉన్నారు.