Home » Business news
కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఈ వారంలో తీవ్ర ఒడిదుడుకులును ఎదుర్కొన్న సూచీలు వారంలో చివరి రోజు మాత్రం భారీ లాభాలను ఆర్జించాయి. రోజుంతా లాభాల బాటల పయనించాయి. శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరును కొనసాగించింది.
ప్రస్తుత కాలంలో ఎవరైనా కూడా తక్కువ కాలంలో పెట్టుబడులు(investments) పెట్టి లక్షాధికారులు కావాలని భావిస్తుంటారు. అందుకోసం పోస్టాఫీస్ గ్యారంటీ పథకం(post office scheme) ఉంది. అదే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) స్కీం. అయితే ఈ స్కీం ద్వారా ఎలా లక్షాధికారులు కావచ్చనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) నేడు శుక్రవారం (జులై 27న) వారం చివరి ట్రేడింగ్ సెషన్లో సానుకూల ధోరణితో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 119 పాయింట్లు పెరిగి 80,158 వద్ద, నిఫ్టీ 50 కూడా 17 పాయింట్లు పెరిగి 24,423 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత ఉదయం 10.30 గంటల సమయంలో సెన్సెక్స్(sensex) 507 పాయింట్లు లాభపడి 80,547 స్థాయిలో ఉండగా, నిఫ్టీ(nifty) 180 పాయింట్లు వృద్ధి చెంది 24,585కి చేరుకుంది.
దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు మళ్లీ తగ్గాయి. ఈ క్రమంలో పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా గోల్డ్ రేటు తగ్గిందని కొనుగోలు చేసేందుకు షాపుల వద్దకు వెళ్లి బారులు తీరుతున్నారు. ప్రస్తుతం నిన్నటితో పోల్చుకుంటే 24 గ్రాముల పసిడి రేటు 10 గ్రాములకు 1,190 రూపాయలు తగ్గింది.
Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23వ తేదీన దేశ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఆయా పథకాలకు కేటాయింపులు, కొత్త పథకాలు ప్రకటించడంతో పాటు.. ఎన్నో అంశాలను పేర్కొన్నారు.
దేశంలో ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 66% మంది పన్ను చెల్లింపుదారులు మాత్రమే కొత్త పన్ను విధానాన్ని(New ITR) ఎంచుకున్నారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఛైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు మొత్తం 4 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్లు(ITR Filing) దాఖలు చేశారని చెప్పారు. అయితే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి జులై 31 చివరి తేదీ ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ చేస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) గురువారం (జులై 25న) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బడ్జెట్ 2024 (budget 2024) తర్వాత నిఫ్టీ నెలవారీ గడువు నేడు ముగుస్తుంది. దీంతో ఈరోజు ట్రేడింగ్ భారీ పతనంతో ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం 9.35 గంటల నాటికి సెన్సెక్స్ 552 పాయింట్లు కోల్పోయి 79,600 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 154 పాయింట్ల నష్టపోయి 24,263 పరిధిలో ఉంది.
జులై 2024 నెల చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలో వచ్చే నెల ఆగస్టులో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు(Bank Holidays) ఉన్నాయి. ఎన్ని రోజులు పని చేయనున్నాయనే(bank working days) విషయాలను తెలుసుకుందాం. ఎందుకంటే ఆగస్టులో ఏకంగా 13 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అంటే దాదాపు సగం రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి.
దేశంలో బడ్జెట్ 2024లో పుత్తడి(gold), వెండి(silver) ధరలపై కస్టమ్స్ రేట్లు తగ్గించిన తర్వాత ఈ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలోనే గత రెండు రోజుల్లోనే దాదాపు 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 5 వేల రూపాయలకుపైగా తగ్గడం విశేషం. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో నేడు(జులై 25న) ఉదయం 6.25 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.65,090గా కలదు.
Budget 2024: కర్ణాటక ఎంపీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంట్లో వరుసగా ఏడుసార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించారు. అయితే, ఆమె ప్రవేశపెట్టిన ఏడు బడ్జెట్లూ విశేషమే. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి.. ప్రత్యేక చీరలో కనిపించారు.