ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కామాటిపురాలో యువకుడి దారుణహత్య

ABN, Publish Date - Dec 10 , 2025 | 08:57 AM

ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని కామాటిపురా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. అరవింద్‌ బోస్లే అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

హైదరాబాద్: బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు. ఈ సంఘటన కామాటిపురా పోలీస్ స్టేషన్‌(Kamatipura Police Station) పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నందిముస్లైగూడకు చెందిన అరవింద్‌ బోస్లే (32) దూద్‌బౌలిలోని ఓ బియ్యం దుకాణంలో పనిచేస్తుంటాడు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా దేవీబాగ్‌ వద్దకు రాగానే గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి కత్తులతో దాడిచేశారు.

తలపై బండరాయితో మోదీ అక్కడినుంచి పారిపోయారు. సమాచారమందుకున్న ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌, పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 10 , 2025 | 08:57 AM