ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Secunderabad: బ్రీఫ్‌ కేసులో గంజాయి తరలింపు..

ABN, Publish Date - Aug 07 , 2025 | 09:34 AM

బ్రీఫ్‌ కేసులో గంజాయి పార్శిల్స్‌ పెట్టి దుస్తులు కప్పి తీసుకొచ్చి విక్రయిస్తున్న స్మగ్లర్‌ కటకటాలపాలయ్యాడు. నిందితుడిని అరెస్టు చేసి 14 కేజీల గంజాయిని, బ్రీఫ్‌ కేసు, సెల్‌ఫోన్‌ను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- సికింద్రాబాద్‌ వెస్ట్‌ మెట్రోస్టేషన్‌ వద్ద స్మగ్లర్‌ పట్టివేత

- 14 కేజీల సరుకు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: బ్రీఫ్‌ కేసులో గంజాయి పార్శిల్స్‌ పెట్టి దుస్తులు కప్పి తీసుకొచ్చి విక్రయిస్తున్న స్మగ్లర్‌ కటకటాలపాలయ్యాడు. నిందితుడిని అరెస్టు చేసి 14 కేజీల గంజాయిని, బ్రీఫ్‌ కేసు, సెల్‌ఫోన్‌ను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం చిత్రపురికి చెందిన సునీల్‌ నాయక్‌ చదువు ఆపేసి ఒక హోటల్‌లో పనిచేస్తున్నాడు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో స్మగ్లర్‌గా మారాడు.

ఒడిశాలోని ఓ సరఫరాదారుడి ద్వారా హైదరాబాద్‌(Hyderabad)లో కొంతమంది కస్టమర్స్‌తో నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నాడు. వారికి అవసరమైనప్పుడల్లా గంజాయిని కొని రెండు కేజీల చొప్పున ప్యాక్‌ చేసి బ్రీఫ్‌ కేసులో అమర్చుతాడు. వాటిపై దుస్తులు పెట్టి సిటీలో ఉద్యోగానికి వెళ్తున్నట్లు బయలుదేరుతాడు. సికింద్రాబాద్‌కు చేరుకొని గుట్టుగా కస్టమర్స్‌కు విక్రయించి డబ్బు తీసుకొని వెళ్లిపోతుంటాడు.

బుధవారం కూడా కోణార్క్‌ రైలు నుంచి బ్రీఫ్‌ కేసుతో సికింద్రాబాద్‌లో దిగి వెస్ట్‌ మెట్రో స్టేషన్‌ వద్ద కస్టమర్స్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ సౌజన్య బృందం రంగంలోకి దిగి అతడిని పట్టుకుంది. 14 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది. దాని విలువ మార్కెట్లో రూ. 7లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.

మరో కేసులో 400 గ్రాములు..

సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌(Secunderabad Clock Tower) వద్ద గంజాయి విక్రయించేందుకుప్రయత్నిస్తున్న మరో స్మగ్లర్‌ జుర్రు ప్రవీణ్‌ను పట్టుకున్నారు. అతని వద్ద 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి సహకరించిన జాటోత్‌ అనిల్‌పైనా కేసు నమోదు చేశారు. వారిని, సరుకును సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దొంగ డెత్‌ సర్టిఫికెట్‌తో ఎల్‌ఐసీకి టోకరా

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 09:34 AM