AP High Court: సివిల్ వివాదాల్లో జాగ్రత్తలు పాటించాలి జస్టిస్ భానుమతి
ABN, Publish Date - Jun 29 , 2025 | 05:48 AM
సివిల్ వివాదాల పరిష్కారంలో తీసుకోవాల్సిన విధి విధానాలపై జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి అన్నారు.
కర్నూలు లీగల్, జూన్ 28(ఆంధ్రజ్యోతి): సివిల్ వివాదాల పరిష్కారంలో తీసుకోవాల్సిన విధి విధానాలపై జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని న్యాయాధికారులకు శనివారం స్థానిక జిల్లా కోర్టులో రెండో జిల్లాస్థాయి వర్క్షాపును ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సివిల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్-9, లోక్అదాలత్ తీర్పులపై ఒకరోజు వర్క్ షాపులో ఆమె మాట్లాడుతూ లోక్అదాలత్ తీర్పులు అమలయ్యేందుకు గట్టిగా కృషి చేయాలని కోరారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.రాధాకృష్ణ కృపాసాగర్, విశ్రాంత జిల్లా న్యాయాధికారి టి.వేణుగోపాల్రావు రిసోర్స్ పర్సన్స్గా ఈ విధి విధానాలను వివరించారు.
Updated Date - Jun 29 , 2025 | 05:48 AM