Home » Kurnool
మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను నయవంచనకు గురి చేసిందంటూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ నాగరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని నిప్పులు చెరిగారు. గత అయిదేళ్లలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ కుప్ప కూలిపోయాయన్నారు. శాంతి భద్రతలు సైతం క్షీణించాయని తెలిపారు.
వివాదాస్పద సినీ నటి శ్రీరెడ్డిపై కర్నూలు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ బీసీ సెల్ నాయకుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Andhrapradesh: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడకు వెళ్తుంటారు. కొందరు వాహనాల్లో స్వామి దర్శనానికి వెళ్తే మరికొందరు నల్లమల అడవుల గుండా ఆ దేవదేవుడిని దర్శించుకునేందుకు పయమనవుతుంటారు.
గోనెగండ్ల మండల పరిధిలోని గంజహళ్లి గ్రామంలో బడేసావలి అనే నకిలీ వైద్యుడు వేసిన ఇనజెక్షన వికటించి ఆదే గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు రాజేష్ మృతి చెందడంపై బుధవారం డిప్యూటీ డీఎంహెచవో సత్యవతి, స్థానిక వైద్యులు కార్తీక్ విచారణ చేపట్టారు.
నంద్యాల సివిల్ సప్లయ్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా పని చేస్తున్న వీణా కుమార్(42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు మూడో పట్టణ సీఐ మురళిధర్ రెడ్డి తెలిపారు.
నంద్యాల జిల్లా: ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యంపై మిస్టరీ వీడింది. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికపై అత్యాచారం చేసి ఎత్తిపోతల కాలవలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమానితులు ముగ్గురు 15 ఏళ్ల లోపువారేనని తెలిపారు.
యువతిపై లైంగిక వేధింపుల కేసులో వైసీపీకి చెందిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ను టూటౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
మున్సిపల్ దుకాణాదారులు బకాయిలు వెంటనే చెల్లించాలని నగర పాలక కమిషనర్ ఏ.భార్గవ్తేజ తెలిపారు.
Andhrapradesh: కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డా.సుధాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో గురువారం ఇంటిలో ఉన్న మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం ఓర్వకల్లు పోలీసు స్టేషన్కు తరలించారు. తన ఇంట్లో పనిచేస్తున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు...
నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో టీడీపీ నేత ఏవీ శ్రీదేవి హత్య కేసులో 6గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 25న పాతూరు వీధిలో శ్రీదేవి హత్య జరిగింది. దీంతో ఆళ్లగడ్డలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శ్రీదేవి హత్య తర్వాత నిందితులు పరారయ్యారు.