Home » High Court
ముస్లిం వివాహాలపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నా.. ముస్లిం వివాహాలకు షరియా చట్టమే వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
వీధి కుక్కల బెడద నివారణ విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాల అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్జీపీ) విష్ణుతేజ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. పూర్తి వివరాలతో సీఎస్ జి.సాయిప్రసాద్ అఫిడవిట్ దాఖలు చేశారని నివేదించారు.
రాయదుర్గం భూముల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. TGIIC దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగిసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశించిన డ్రోన్ సర్వేపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
మసీదు కమిటీ ఫత్వాపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహాన్ని రద్దు చేసే అధికారం ఏ మతపరమైన సంస్థలు, కమిటీలు, లేదా సెమినరీలకు లేదని స్పష్టం చేసింది. కేవలం మసీదు కమిటీ జారీ చేసిన ఫత్వా ఆధారంగా వివాహ బంధం రద్దు అయినట్లు పరిగణించలేమని తేల్చిచెప్పింది.
ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. మెగా DSC ప్రక్రియపై వైసీపీ ఎమ్మెల్సీ పార్వతారెడ్డి చంద్రశేఖర్రెడ్డి దాఖలు చేసిన పిల్ను హైకోర్టు విచారణ సందర్భంగా తప్పుబట్టింది.
అమరావతి భూ సేకరణపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భూ సేకరణపై అభ్యంతరం ఉన్న రైతులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించినప్పుడు మరో పిల్ ఎందుకని ప్రశ్నించింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ తమ్మినేని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది.
హిందూ వివాహ వ్యవస్థ విశిష్టతపై గుజరాత్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిందూ సంప్రదాయాల ప్రకారం 'సప్తపది' వంటి శాస్త్రోక్తమైన క్రతువులు, ఆచారాలు నిర్వహించకుండా కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందినంత మాత్రాన ఆ పెళ్లి చెల్లుబాటు కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కోల్కతా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ బ్యాంక్ ఖాతాల ఫ్రీజింగ్ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలన్న టీఎంసీ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది.
బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది.