Home » High Court
పశ్చిమ బెంగాల్లో లోక్ సభ ఎన్నికలు జరిగేందుకు అనుమతించబోమని కోల్ కతా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శ్రీరామ నవమి ఊరేగింపు సందర్భంగా 17వ తేదీన ముర్షిదాబాద్లో మత ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. హింసాత్మక ఘటనపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
కోల్కత్తా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో నియమించిన 24 వేల ఉపాధ్యాయుల నియామకాన్ని రద్దు చేసింది. జస్టిస్ దేబాంగుశ్ బసక్, షబ్బార్ రషీద్తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశించింది.
ఆరేళ్లు నిండిన తర్వాతే ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించాలన్న ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.
అమరావతి: జనసేనకు ఏపీ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ గ్లాస్ గుర్తు కేటాయించింది. అయితే జనసేనకు గ్లాస్ గుర్తు కేటాయించవద్ధని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) హైకోర్టులో పిటిషన్ వేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
రాష్ట్రంలో 11 జిల్లాల్లో రామనవమి యాత్రకు అనుమతించలేమని మద్రాసు హైకోర్టు(Madras High Court) స్పష్టం చేసింది. ఏదైనా ఒక జిల్లాలో యాత్రకు అనుమతించవచ్చని హైకోర్టు సూచించింది. ఎన్నికల భద్రత కారణంగా ఈ ఏడాది రామనవమి యాత్రను అనుమతించలేమని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.
రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోవడంపై కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింగ్వీ కోర్టును ఆశ్రయించారు. రాజ్యసభ ఎన్నికల్లో తన ప్రత్యర్థికి సరైన బలం లేదని, అయినా గెలిచారని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులకు ఓకే సంఖ్యలో ఓట్లు వస్తే లాటరీ ద్వారా డ్రా తీయడం కరెక్ట్ కాదని అభిప్రాయ పడ్డారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్కు హైకోర్టులో కాస్త ఊరట కలిగింది. ప్రజా భవన్ వద్ద బారికేడ్లను ఢీ కొట్టి పారిపోయిన కేసులో సాహిల్కు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు రద్దు చేయాలని సాహిల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నోటీసులు రద్దు చేస్తే భారతదేశానికి వచ్చి విచారణకు సహకరిస్తానని సాహిల్ స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కోల్ కతా హైకోర్టు గురువారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సందేశ్ఖాళి ఘటనకు సంబంధించి అఫిడవిట్లపై చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. సందేశ్ఖాళిలో టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతని అనుచరులు దోపిడీ, భూ కబ్జా, లైంగిక వేధింపుల గురించి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఏ చట్ట ప్రకారం ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీ కరిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ (Steel Plant) ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ..