Home » High Court
ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సిట్ ఏర్పాటుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థుల జవాబుపత్రాలు భద్రంగా ఉన్నాయా? లేదా? వాటిని ఎవరైనా ట్యాంపర్ చేశారా? అనేది ఫోరెన్సిక్ నిపుణులతో పరిశీలించాలని సూచించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోనే విచారణకు రావాలని సిట్ స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణ హైదరాబాద్లోనే జరుగుతోందని, కేసు హైదరాబాద్ పరిధిలోదని గుర్తు చేసింది.
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలకు హైకోర్టు శుభవార్త చెప్పింది. బైక్ ట్యాక్సీ సేవలపై గతంలో ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సలేం కేసులో తాము ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ అని సీబీఐ పేర్కొంటూ తమను రెస్పాండెంట్గా చేర్చాలని కోరింది. సలేంకు బెయిల్ కానీ, పెరోల్ కానీ ఇస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చని కూడా సీబీఐ స్పష్టం చేసింది..
కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఫిబ్రవరి 20లోపు లిఖితపూర్వకమైన సబ్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
టీఎంసీ సంబంధించిన ఎలాంటి డేటాను తాము సీజ్ చేయలేదని కోల్కతా హైకోర్టులో విచారణ సందర్భంగా ఈడీ తెలిపింది. కస్టడీలోకి తీసుకోని సామగ్రిని సురక్షితంగా ఉంచాలనడం ఏమిటని ప్రశ్నించింది.
సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ వేసిన పిటిషన్ పై గురువారం నాడు హైకోర్టులో వాదనలు ముగిశాయి. హైకోర్టు ధర్మాసనం తీర్పును ఈనెల 19కి వాయిదా వేసింది.
ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు.
అమరావతిలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటు కోసం ఖరారు అయిన టెండర్ పై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఆ పిల్ను విచారించిన హైకోర్టు కొట్టేసింది.
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్లో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది.