Share News

Telangana High Court: కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై విచారణ వాయిదా

ABN , Publish Date - Jan 19 , 2026 | 02:47 PM

కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఫిబ్రవరి 20లోపు లిఖితపూర్వకమైన సబ్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Telangana High Court: కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై విచారణ వాయిదా
Telangana High Court

హైదరాబాద్, జనవరి 19: కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) విచారణ వాయిదా పడింది. కాళేశ్వరంలో జరిగిన అక్రమాలు, అవినీతి ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె జోషి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. కేసీఆర్, హరీష్ రావ్ తరఫున సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ సుందరం వాదనలు వినిపించారు.


ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వ కౌంటర్‌కు పిటిషనర్లు రిప్లై ఫైల్ చేశారు. రిప్లైకు ప్రభుత్వం రిటన్ సబ్మిషన్ ఇచ్చేందుకు సమయం కావాలని హైకోర్టును అడ్వకేట్ జనరల్ కోరారు. ఫిబ్రవరి 20లోపు లిఖితపూర్వకమైన సబ్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది. అప్పటి వరకు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి...

ఘోరం.. భార్య గొంతు కోసిన భర్త.. అడ్డొచ్చిన కూతురిపైనా..

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు.. బీజేపీ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో కీలక పరిణామం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 19 , 2026 | 03:19 PM