Home » Court
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి, లైంగికంగా దాడి చేసిన ఘటనలో ఎస్ఐ రవితేజకు గుంటూరు జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్షను విధించింది.
సత్యం కంప్యూటర్ స్కామ్లో జన్వాడ భూములపై నాంపల్లి ప్రత్యేక కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. జన్వాడ ల్యాండ్ కేసులో సత్యం రాజు, నందిని రాజు, తేజ రాజులతో పాటు 213 మందికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఈడీ అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశించింది.
లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, కుమార్తె మిసా భారతితో సహా ఆయన కుటుంబ సభ్యులు ఉద్యోగానికి బదులుగా భూమిని స్వాధీనం చేసుకున్నట్టు బలమైన ఆధారాలున్నాయని ఢిల్లీ కోర్టు పేర్కొంది.
మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. పటమట, పెనమలూరు పోలీసులకు చిక్కిన మావోయిస్టు నిందితుల రిమాండ్ ఈ రోజు ముగియాల్సి ఉంది. అయితే, పోలీస్ అధికారులు మరింత సమగ్ర దర్యాప్తు కోసం రిమాండ్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.
సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్లో 2011లో చోటుచేసుకున్న దారుణ హత్యకేసులో కూకట్పల్లి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు కరణ్ సింగ్ (అలియాస్ కమ్మ సింగ్)కి మరణశిక్ష విధించింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో కీలక మార్పులు జరగడంతో విచారణ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.
నాంపల్లి కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తి దగ్గరి నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ క్రమంలో వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని మరోసారి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. నాలుగు కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది నాంపల్లి కోర్టు.
వైసీపీ అధికారంలో ఉండగా ఫైబర్నెట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై నమోదు చేసిన సీఐడీ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆయనతోపాటు మిగిలిన నిందితులకు క్లీన్చిట్ ఇచ్చింది.
ఒక ప్రముఖ నటి 2017 ఫిబ్రవరి 17న అపహరణకు గురికావడం, కేరళలోని కొచ్చి సమీపంలో కదులుతున్న కారులో ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు ఆరోపణలు రావడం మలయాళ పరిశ్రమను కుదిపేసింది. అప్పట్లో ఆ నటి వయస్సు 20 ఏళ్లు.