ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అడ్డగోలు భూపందేరాలు చేసింది జగనే: అశోక్‌బాబు

ABN, Publish Date - Apr 30 , 2025 | 06:10 AM

జగన్ రేడిపై టీడీపీ నేత అశోక్ బాబు ఆక్షేపాలు, అక్రమ భూకేటాయింపులపై తీవ్ర ఆరోపణలు. జగన్ పత్రికలో అబద్ధ రాతలు ప్రచారం చేసి, చంద్రబాబుకు పునరావృతంగా దండం పెట్టాలని డిమాండ్ చేశారు.

క్రమ భూకేటాయింపులకు పెట్టింది పేరు జగన్‌రెడ్డి అని మాజీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. ఉర్సాకు భూకేటాయింపులపై జగన్‌ పత్రిక రాతలు అబద్ధాలని తేలితే వారి ముక్కు నేలకు రాయాలని, జగన్‌ పత్రిక కార్యాలయంలో చంద్రబాబు ఫొటో పెట్టుకుని పాలాభిషేకం చేసి, ఆయన ఫొటోకు దండం పెట్టాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడారు. ఉర్సాకు 99 పైసలకే భూకేటాయింపు చేశారంటూ జగన్‌ తన సొంత పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నారని ధ్వజమెత్తారు. అబద్ధాలు ప్రచారం చేస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగన్‌ హయాంలోనే అడ్డగోలుగా భూపందేరాలు చేశారని మండిపడ్డారు.

Updated Date - Apr 30 , 2025 | 06:12 AM