Home » TDP
ఏపీ శాసనమండలిలో మరోసారి గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సభను సోమవారానికి వాయిదా వేశారు. వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ కూటమి సభ్యులు డిమాండ్ చేశారు.
ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోలను ప్రదర్శించడంపై కూటమి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంట్లో చోరీకి తెగబడ్డారు దుండగులు. దాదాపు 50 తులాల బంగారం, 10 కిలోల వెండి, లక్ష నగదును దుండగులు అపహరించారు.
ఆంధ్రా వీరప్పన్గా పేరుగాంచిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అల్జీమర్స్ వ్యాధి సోకినట్లుందని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.
జగన్ పాలనలో సీమకు తీరని ద్రోహం జరిగిందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు విమర్శించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ఆయన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను నిత్యం భయభ్రాంతులకు గురిచేసే క్రిమినల్ అంబటి రాంబాబు అంటూ మండిపడ్డారు.
వైసీపీ నేతలు తిరుమల లడ్డూ సహా పలు అంశాల్లో తప్పులు చేయకపోతే అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ప్రశ్నించారు.
వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు నోటీసులిచ్చారు. బాలిక మృతి కేసులో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో విచారణకు రావాలని ఆదేశించారు.
పట్టు రైతులకు పూర్వవైభవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పేర్కొన్నారు. స్థానిక పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ పరికరాలు పంపిణీ చేశారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంపై టీడీపీ ఎంపీ అప్పలనాయుడు విరుచుకుపడ్డారు.CFTRI రిపోర్టును తొక్కిపెట్టింది నిజం కాదా?భోలేబాబా డెయిరీకి కొమ్ముకాసింది ఎవరు? అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.