Home » YCP
విజయవాడ: ఎన్డీఏతోనే వైసీపీ కాపురమంటూ మనసులో మర్మాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయటపెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. 1200 రోజులుగా విశాఖ ఉక్కు ఉద్యమం జరుగుతున్నా పట్టించుకోని జగన్కు ఇవాళ ఉక్కు కార్మికుల ఓట్లు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు.
నామినేషన్ల దాఖలుకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు జోరు పెంచారు. అనంతపురం ఎంపీ స్థానానికి మంగళవారం ఒకరు నామినేషన వేశారు. బీఎస్పీ అభ్యర్థి బి.నారాయణప్ప, ఎస్పీ అభ్యర్థి నిజామ్ జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్కు నామినేషన పత్రాలను సమర్పించారు. అసెంబ్లీ స్థానాల్లో అనంతపురం అర్బనలో 14, రాప్తాడులో 08, ఉరవకొండలో 07, గుంతకల్లులో 03, కళ్యాణదుర్గంలో 06, రాయదుర్గంలో 05, తాడిపత్రి 2, శింగనమలలో ఐదు నామినేషనలు దాఖలయ్యాయి.
ఏపీలో వరుసగా రెండోసారి అధికారం కోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ఆ నినాదాన్ని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. జనం నాడిని పసిగట్టిన జగన్ అధికారానికి కావల్సిన మెజార్టీ మార్క్పై ప్రధానంగా దృష్టిపెట్టారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో తాము సునాయసంగా గెలుస్తామని భావించిన వైసీపీ ఆశలు ఫలించేట్లు కనిపించడంలేదు. ప్రజలు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో జగన్కు మేమంతా బస్సు యాత్రలో స్పష్టంగా కనిపించింది.
విశాఖ జిల్లా: భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ మీద షాక్లు తగులుతున్నాయి. నిన్న జగన్ భీమిలి నియోజకవర్గంలోకి ప్రవేశించే సమయంలో కుసులువాడ గ్రామ పంచాయతీ మొత్తం టీడీపీలోకి చేరిపోయింది. ఇవాళ అదే నియోజకవర్గంపై సీఎం జగన్ స్వయంగా సమీక్ష చేస్తున్నారు.
నంద్యాల జిల్లా: నందికొడ్కూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గిత్త జయసూర్య నామినేషన్ వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన ఆయన నందికొడ్కూర్ తాహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేశాం. ‘నాడు - నేడు’తో అన్ని పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దాం..8వ తరగతి పిల్లలకు ప్రతి ఏడాది ట్యాబ్లు ఉచితంగా పంపిణి చేస్తున్నాం.. ఇవన్నీ చూస్తే త్వరలో కార్పొరేట్ పాఠశాలలే ప్రభుత్వ బడులతో పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు..
ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. నామినేషన్ల ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే చాలా మంది ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ(YSRCP)కి కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయట. ప్రచారానికి, వైసీపీ సభలకు జనం నుంచి స్పందన అరకొరగా ఉందనే ప్రచారం జరగుుతోంది.
జిల్లాలో సోమవారం నామినేషన్ల జోరు పెరిగింది. మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో మంచి ముహూర్తం చూసుకుని నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎంపీ స్థానానికి పది, అసెంబ్లీ స్థానాలకు 65 నామినేషన్లు దాఖలయ్యాయి. కానీ సోమవారం ఒకే రోజు ఎంపీ స్థానానికి ఆరుగురు, 14 అసెంబ్లీ స్థానాలకు 27 మంది నామినేషన దాఖలు చేశారు.
వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నామినేషన ప్రక్రియలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. నామినేషన కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన అమలులో ఉన్నా.. బేఖాతరు చేశారు. పరిమితి దాటి, పార్టీ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. విశ్వేశ్వరరెడ్డి నామినేషన వేసేందుకు తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లగా..
మండల పరిధిలోని వెంకటంపల్లిలో టీడీపీ కార్యకర్త గోవిందుపై వైసీపీ నాయకులు సోమవారం దాడి చేశారు. టీ స్టాల్ వద్ద ఉన్న తనపై వైసీపీ నాయకులు చంద్రశేఖర్రెడ్డి, వెంకటరామిరెడ్డి, సూర్యనారాయణరెడ్డి అనూహ్యంగా కర్రలతో దాడి చేశారని బాధితుడు తెలిపాడు