Home » YCP
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ను వ్యక్తిగతంగా ఎప్పుడూ తిట్టలేదని.. ఆయన వ్యతిరేక సిద్ధాంతాలపైనే మాట్లాడుతానని చెప్పుకొచ్చారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో ఎన్నికలకు వెళ్తే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని.. ఇప్పుడు మావిగన్ అనే పిచ్చిచేష్టలతో ఎన్నికలకు వెళ్తే సున్నాకే పరిమితం అవుతారంటూ వ్యాఖ్యానించారు.
పేదలను ఆనందంగా చూడాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. పెన్షన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు.
ఐదేళ్ల పాటు రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.
వైసీపీ నేతలను రాజధాని రైతులు అడ్డుకోవడంపై హోం మంత్రి అనిత స్పందించారు. వైసీపీ నేతలకు అమరావతిలో పర్యటించే నైతిక అర్హత లేదన్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భగత్సింగ్ నగర్లోని తన నివాసం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు.
విజయవాడలోని కానూరు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ జెండా దిమ్మెను వైసీపీ స్థానిక నాయకుడు దేవభక్తుని చక్రవర్తి, అతని అనుచరులు కూల్చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
వైసీపీ నేత దేవినేని అవినాష్పై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వాస్తవాలు మరచి గొడ్డలి పార్టీ నాయకులు నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు.
వైసీపీని కాపులు నమ్ముతారా? వారికి అండగా ఉంటామని చెబితే విశ్వసిస్తారా? వైసీపీలోని కాపు నేతల్లోనే తలెత్తుతున్న ప్రశ్నలివి.
గండిపేట భూకబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి బెయిల్ మంజూరు అయ్యింది. ఆయనకు రంగారెడ్డి కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.