Home » YCP
జిల్లాలోని ఆయా మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల దౌర్జన్యాలకు అంతేలేకుండా పోతోంది. ఆ పార్టీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్బంగా రప్పా రప్పా అంటూ ప్లెక్సీలు పెట్టి అలజడి చేశారు. తాజాగా మరో నాయకుడు, ఆయన కొడుకు దాడిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు చేసిన భీభత్సం ఇంకా గ్రామాల్లో అలజడి రేపుతూనే ఉంది. ఆ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి అనుమతి లేకుండా ర్యాలీ, రోడ్డుపై ధర్నాలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కాస్త దెబ్బతింటోంది. అంతేగాక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ ముఠా ఎంతకైనా దిగజారుతోందని హోంమంత్రి అనిత వ్యాఖ్యలు చేశారు. మూగ జీవాలను బలి తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వైసీపీ పార్టీ ఉన్మాదాన్ని ప్రజలు గ్రహించాలన్నారు.
గత కొంతకాలంగా ధర్మాన కృష్ణదాసు సోదరులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. మరో సంచలన ఆడియో విడుదల చేశారు. ధర్మాన సోదరులు తనను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
రాజకీయ ముసుగులో చేసే నేరాలు అంగీకరించేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
అనంతపురం జిల్లాలో వైసీసీ కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. మాజీ ముఖ్యమంత్రతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల సందర్బంగా రప్పా.. రప్పా.. అంటూ ఆ పార్టీ కార్యకర్తలు చేసిన భీభత్సాన్ని పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల పేరుతో జరిగిన ఉన్మాదంపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జగన్ ఫొటో పట్టుకుని రప్పా రప్పా అంటూ ఆ పార్టీ కార్యకర్తలు భీభత్స చేశారు. అలాగే మరికొంతమంది రక్తతర్పణం అంటూ అలజడులు రేకెత్తించారు. అయితే.. దీనిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.
జగన్ పుట్టినరోజు సందర్భంగా ఓ గర్భిణి పట్ల దారుణంగా ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తకు పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. వైసీపీ కార్యకర్త అజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్త వివాదానికి దారితీశాయి. కొంతమంది వైసీపీ కార్యకర్తలు రప్పా.. రప్పా అంటూ జగన్ ఫోటోలను పట్టుకొని వీధుల్లో తిరగడం ఇప్పుడు వివాదాలు చోటుచేసుకున్నాయి. దీనిపై పొలీసులు సైతం కేసులు నమోదు చేస్తున్నారు.
దొరసానిపాడులో బైక్కు సైలెన్సర్లు తీసివేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు వైసీపీ శ్రేణులు. పోలీసులు బైక్ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా దౌర్జన్యానికి దిగారు.