Home » YCP
వైసీపీ నేత, మాజీ డిఫ్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో నిత్యానంద రెడ్డిని చిన్నచౌక్ పోలీసులు విచారించారు.
దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమండ్రి ప్రత్యేక కోర్టులో రెండో రోజు విచారణ కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఈరోజు కోర్టుకు హాజరయ్యారు.
కర్నూలులో వైసీపీ నేతల ఆందోళనలపై ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. వైసీపీ నాయకులు చిల్లర ఇష్యూలను పట్టుకొని అల్లరి మూకలతో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
కర్నూలు జిల్లా శ్రీరామ నగర్ 23వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి సునీల్పై వైసీపీ మూకలు కత్తులతో దాడి చేయడాన్ని ఖండిస్తూ టీడీపీ నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
అనంతపురం రూరల్ మండలంలోని కురుగుంట గ్రామ సర్వే నంబరు 153లోని వంక పోరంబోకు భూమి అక్రమాల్లో వైసీపీ నాయకులపై రెవెన్యూ అధికారులు ప్రేమ ఒలకబోస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
వైసీపీ నేత, కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసులో నిత్యానంద రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
23 నెలల కూటమి పాలనలో భయపెట్టే రాజకీయాలకు ముగింపు పలికి, భరోసా కలిగించే పరిపాలన అందుతోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. వైజాగ్ అంటే ఒకప్పుడు గంజాయి గుర్తొచ్చేదని.. నేడు గూగుల్, టీసీఎస్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు గుర్తుకొస్తున్నాయన్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు పోలీస్ కస్టడీ ముగిసింది. ఈరోజు వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్సీని జీజీహెచ్ ఆస్పత్రికి పోలీసులు తీసుకొచ్చారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రత్యేక సదుపాయాలు కోరిన అంశంపై జైలు అధికారులు స్పందించారు. జైలు నిబంధనలు, కోర్టు ఆదేశాల ప్రకారమే సదుపాయాలు కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
వైసీపీపై మంత్రి వాసంశెట్టి సుభాశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లు వైసీపీ పాలనలో జగన్ అనేక కంపెనీలను తరమికొట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి తెలిపారు.