Ananthapuram News: రైతులపై వైసీపీ నాయకుడి దౌర్జన్యం - ఇద్దరికి గాయాలు
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:55 AM
జిల్లాలోని ఆయా మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల దౌర్జన్యాలకు అంతేలేకుండా పోతోంది. ఆ పార్టీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్బంగా రప్పా రప్పా అంటూ ప్లెక్సీలు పెట్టి అలజడి చేశారు. తాజాగా మరో నాయకుడు, ఆయన కొడుకు దాడిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
యల్లనూరు(అనంతపురం): మండలంలోని తిమ్మంపల్లి(Timmampalli)లో రామచంద్రారెడ్డి, సతీష్రెడ్డి అనే రైతులపై వైసీపీకి చెందిన మల్లారెడ్డి, అతడి కుమారులు దాడి చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. సతీష్రెడ్డికి చెందిన భూమిని 15 నెలల క్రితం రామచంద్రారెడ్డి కొనుగోలు చేశాడు. ఈ పొలంలో బుధవారం ఉదయం ఎక్స్కవేటర్ సాయంతో పనిచేస్తుండగా.. మల్లారెడ్డి, అతడి కొడుకు భరత్ కలిసి తాము కొనాలనుకున్న భూమి నువ్వెలా కొని సాగుచేస్తావు అంటూ రామచంద్రారెడ్డిపై దాడిచేశారు.

ఈ విషయం తెలిసి సతీష్ రెడ్డి తోట వద్దకు రాగా మరోసారి మల్లారెడ్డి, భరత్రెడ్డి, కిరణ్కుమార్రెడ్డి కలిసి సతీష్ రెడ్డిపై దాడిచేశారు. భూమి అమ్మనందుకే తనపై దాడిచేశారని సతీష్ రెడ్డి వాపోయారు. దీనిపై యల్లనూరు పోలీస్స్టేషన్(Yellanuru Police Station)లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. 'కల్కి-2' షూటింగ్కు డార్లింగ్!
రానూపోనూ టికెట్లు బుక్ చేస్తే 10శాతం రాయితీ
Read Latest Telangana News and National News