Home » Ananthapuram
వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మండిపడ్డారు. వీధి రౌడీల్లా వ్యవహరిస్తూ.. గ్రామాల్లో అశాంతిని రేకెత్తిస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారని, వైసీపీ నేతల ఆగడాలను సహించేది లేదన్నారు.
నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరితే చర్యలుంటాయని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... అనంతపురం నగరంతోపాటు అన్ని మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.
గత కొద్దిరోజులుగా మంచు విపరీతంగా పడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పొగమంచు కారణంగా ప్రధానంగా రహదారులపై వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధానంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లో లేక మరే ఇతర కారణాల వల్లనో కాని పెద్దసంఖ్యలో అనారోగ్యానిరి గురయ్యారు. కాగా.. చలి తీవ్రత పెరిగిన నేపధ్యంలో జలుబు, జ్వరాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.
అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ‘కొత్త’ సందడి నెలకొంది. పార్టీ జిల్లా నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ సందర్భంగా కార్యకర్తలు పెద్దఎత్తున విచ్చేశారు. దీంతో కార్యకర్తలు, నాయకులతో కార్యాలయం కిక్కిరిసిపోయింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు చేసిన భీభత్సం ఇంకా గ్రామాల్లో అలజడి రేపుతూనే ఉంది. ఆ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి అనుమతి లేకుండా ర్యాలీ, రోడ్డుపై ధర్నాలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కాస్త దెబ్బతింటోంది. అంతేగాక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
టమోటా ధర మళ్లీ పెరిగింది. మార్కెట్లో కేజీ రూ. 46కు విక్రయిస్తుండగా.. మరికొన్నిచోట్ల రూ. రూ. 55 వరకు విక్రయిస్తున్నారు. నిన్న మిన్నటివరకు ధర లేక దిగాలు పడ్డ రైతులు పెరిగిన ధరలతో కొ్ంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకలకుంట గ్రామం.. ఆకుకూరల ఖిల్లాగా ప్రసిద్ధిచెందింది. దాదాపు 45 సంవత్సరాలుగా ఆ గ్రామంలోని సన్న చిన్నకారు రైతులందరూ ఆకుకూరలను పండిస్తూ లాభాలను పొందుతున్నారు.
అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, కుందుర్పి మండలాల్లో చిరుతపులుల సంచారంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. కళ్యాణదుర్గం మండల కేంద్రానికి ఓ గ్రానైట్ కొండపై, అలాగే కుందుర్పి మండలం రుద్రంపల్లిలో చిరుతపులులు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.
అనంతపురంలో కిలో గోధుమ పిండి.. కేవలం రూ.20కే విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లో రూ. రూ.40ల నుంచి రూ.80ల వరకు అమ్ముతుండగా.. ప్రజల కోసం రాష్ట్రప్రభుత్వం రేషన్ షాపుల్లో కేవలం రూ.20కే విక్రయిస్తోంది. దీంతో ప్రజలు రేషన్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు.