Home » AP Police
పల్నాడు జిల్లాలో రాకెట్ ల్యాబ్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో విడతల వారీగా రూ.25 కోట్ల వరకు వస్తాయని నమ్మబలికి వందలాది మంది నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనేడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నవవధువు సత్యంశెట్టి వెంకటలక్ష్మి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో జై భారత్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.
విజయవాడలో ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి విజయవాడలో నిందితులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ప్రజావ్యతిరేక సంస్కృతి పెరిగిందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ఆగ్రహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలంలోని ఎస్.కొండేపాడు గ్రామంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. బజ్జీలు తిన్న అనంతరం 13 మంది ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది.
విజయవాడలోని పటమటలంక ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రత్యూష అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రార్థనా స్థలాల్లో అనధికార లౌడ్స్పీకర్లపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకి రఘురామ సోమవారం లేఖ రాశారు.
ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై చోరీలకు పాల్పడుతున్న ఇంజినీరింగ్ విద్యార్థిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ సచివాలయాల్లో చోరీలు చేసిన మహేశ్ నుంచి 30 ప్రింటర్లు, 3 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు.
పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. గోళ్లమూడి వారి వీధిలో ఉన్న నాగలక్ష్మి జ్యువెల్లరీ షాపులో దొంగలు చోరీకి పాల్పడ్డారు.