Home » AP Police
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లపై జరుగుతున్న సామాజిక మాధ్యమాల దుష్ప్రచారంపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇలా ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
చిత్తూరు శివారులోని ఇరువరం సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ కారుపై పడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని చిత్తూరు జిల్లా పోలీసులు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో నిరుద్యోగులే లక్ష్యంగా కేటుగాళ్లు పంజా విసిరారు. విదేశాల్లో ఉద్యోగం, లక్షల్లో జీతం అంటూ కలలు చూపించి, అమాయకుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. నర్సాపురం నియోజకవర్గంలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా వివాదంలో వైసీపీ నేత అంబటి రాంబాబును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. జనసేన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పీటీ వారెంట్ కారణంగా ఈ చర్య తీసుకున్నారు.
ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రసాదంలో కల్తీ జరిగిందని సిట్ నివేదికలో ప్రస్తావించింది. 2022-24 మధ్య కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు సిట్ నివేదికలో వెల్లడించింది.
అమలాపురానికి చెందిన ఓ పీఎంపీ వైద్యుడు ఆన్లైన్ మోసగాళ్ల వలలో పడి మోసపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది. సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్లకు ఈ లేఖలు అందినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ ఈ లేఖలు బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుకు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలో బారికేడ్లు తోసుకుని వెళ్లిన ఘటనపై గతంలోనే అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వేంకటేశ్వర స్వామి కల్తీ లడ్డూ విషయంలో మాజీ సీఎం జగన్నే బాధ్యుడిని చేయాలని డిమాండ్ చేశారు.
ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి సంబంధించి.. విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుకు చంద్రగిరి పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేశారు.