ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP state president: మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకునేది మోదీ మాత్రమే..

ABN, Publish Date - Apr 17 , 2024 | 11:59 AM

మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకొనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మాత్రమేనని కోయంబత్తూర్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai) పేర్కొన్నారు.

- బీజేపీ అధ్యక్షుడు అన్నామలై

చెన్నై: మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకొనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మాత్రమేనని కోయంబత్తూర్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai) పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సూలూరులో ఆయన మాట్లాడుతూ... రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం ఇంకా ఆగలేదన్నారు. అంతకుముందు సిరియాపై జరిపిన దాడిలో ఇరాన్‌ అధికారులు మృతి చెందారని తెలిపారు. ప్రస్తుతం ఇరాన్‌ - ఇజ్రాయిల్‌(Iran - Israel) మధ్య ప్రత్యక్ష యుద్ధం జరుగుతోందన్నారు.

ఇదికూడా చదవండి: Raipur: భేష్.. నక్సలైట్ల ఎన్‌కౌంటర్‌ని అతిపెద్ద విజయంగా అభివర్ణించిన ఛత్తీస్‌గఢ్ సీఎం

ఈ యుద్ధం సమయాల్లో భారత్‌ నాయకత్వం మరింత పటిష్ఠంగా ఉండాలన్నారు. దేశ రక్షణ, సార్వభౌమ్యాధికారాన్ని రక్షించేందుకు 2024లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టడం అత్యంత అవసరమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధమేఘాలు కమ్ముకున్న సమయంలో దేశ భద్రత మోదీ ఒక్కడి వల్లే సాధ్యమని దేశప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. కఠిన పరిస్థితుల్లో పదేళ్లుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు మోదీ కృషి చేశారని తెలిపారు. ప్రపంచ నేతలందరితో మాట్లాడే అవకాశం ఒక్క మోదీకే ఉందని అన్నామలై చెప్పుకొచ్చారు.

ఇవికూడా చదవండి: Encounter: 29 మంది నక్సల్స్‌ మృతి.. మావోయిస్టు చరిత్రలోనే భారీ ఎన్‌కౌంటర్..!

Updated Date - Apr 17 , 2024 | 12:04 PM

Advertising
Advertising