Home » AP Election 2024
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై సీబీఐ షాక్ ఇచ్చింది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ నెల17 నుంచి జూన్ 1 వరకూ యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు. కుటుంబంతో జెరూసలేం, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందన్నారు. లండన్లో కుమార్తెలు ఉండడంతో వారితో ఉండేందుకు విదేశాలకు వెళుతున్నారని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఎలాగైనా సరే గెలవాలని చూస్తోంది. అందుకోసం అడ్డదారులను వెతుకుతుంది. తప్పుడు ఐడీల ద్వారా దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేస్తుంది. తిరుపతిలో ఫేక్ ఐడీలతో దొంగ ఓట్లు వేస్తారనే సమాచారం తమకు ఉందని జనసేన పార్టీ పరిశీలకుడు ఏఎం రత్నం వివరించారు.
Andhrapradesh: కూటమి తనకు అభ్యర్థులే ముఖ్యమని.. వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలతో తనకు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ వచ్చాక రాష్ట్ర అభివృద్ధి కుంటు పడిందని విమర్శించారు. రాష్ట్రం బాగుండాలి అంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు రావాల్సిందే అని చెప్పుకొచ్చారు. దేశంలో ఉన్న సర్వేలు అన్నీ కూటమి గెలుపు ఖాయం అని చెబుతున్నాయన్నారు.
మరో నాలుగు రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Election 2024) జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు జగన్ చేస్తున్న కుటీల ప్రయత్నాలకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. సంక్షేమ పథకాల పేరుతో పోలింగ్కు 2 రోజుల ముందు డబ్బులు పంపిణీ చేయాలనే ప్రయత్నాలను తిప్పికొట్టింది. సంక్షేమ పథకాల సొమ్ముల చెల్లింపునకు కేంద్ర ఎన్నికల సంఘం నో చెప్పింది.
2019లో పరిస్థితి వేరు.. ఇప్పుడు వేరు. ఆ సమయంలో ఒక్క ఛాన్స్ అని ప్రజలను జగన్ అడిగారు. సరేలే అని అవకాశం ఇచ్చి ఉంటారు. ఛాన్స్ ఇస్తే ఏం చేశాడో ఆ జనమే చూశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా వేదిక కూల్చి తన మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నాడు. తర్వాత విపక్ష నేతలను టార్గెట్ చేశాడు. తొలినాళ్లలో కరెంట్ సమస్య ఎక్కువగా ఉండేది. రహదారుల సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికి రహదారుల మరమ్మతులు జరగలేదు. అందుకే ఈ సారి కూటమి వైపు జనాలు మొగ్గు చూపే అవకాశం ఉంది.
Andhrapradesh: ఈ ఎన్నికలు దేశంలో చాలా కీలకంగా ఉన్నాయని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ఉంటుందా?.. లేదా?, వచ్చే పరిణామాలు తట్టుకుంటాయా?.. లేదా? అనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం దేశంలో జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న అనేక దారుణాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు ఇచ్చామన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని సీపీఎం రాఘవులు ఫైర్ అయ్యారు. నేడు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్పై ఫైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారకుడు జగనే.. ఆయన సహకారంతోనే ప్రైవేటీకరణ ప్రారంభమైందన్నారు. స్టీల్ ప్లాంట్ను రక్షిస్తానంటూ జగన్ వ్యాఖ్యలు కార్మికులను, ప్రజల్ని ఎగతాళి చేయడమేనన్నారు.
Andhrapradesh: జిల్లాలో అర్ధాతరంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూత్లు మూసివేశారు. గడువు ఉండగానే పోలింగ్ బూత్లు మూసివేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూత్లను అధికారులు మూసివేశారు. అయితే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నేటి వరకు గడువు ఉంది.
Andhrapradesh: తెలుగు దేశం పార్టీకి ముస్లిం సంఘాలు పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవాలని, చంద్రబాబు సీఎం అవ్వాలని ముస్లిం సంఘాల నేతలు కోరుతున్నారు. తాజాగా టీడీపీకి జమాత్ ఉలమ ఏ హింద్ పూర్తి మద్దతు తెలిపింది. గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జమాత్ ఉలమ ఏ హింద్ జాతీయ అధ్యక్షులు మౌలానా సుహైబ్ ఖాసిమి భేటీ అయ్యారు.
ఏపీలో ఎన్నికల(ap elections 2024) ఓటింగ్కు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది. సమయం తక్కువగా ఉండటంతో ఓటర్లకు నగదును(cash) పంచేందుకు పలు పార్టీలు పెద్ద ఎత్తున నగదును పంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల దృష్ట్యా పోలీసు బృందాల పెట్రోలింగ్, తనిఖీల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట పరిధిలో భారీగా నగదును పట్టుకున్నారు.