Home » Annamalai
సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో తమ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలే లేవని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై స్పష్టం చేశారు. పార్టీపరంగా రెండు మహానాడులు నిర్వహించి జనసమీకరణ చేసినంత మాత్రాన ఆ జనం టీవీకేకు ఓట్లు వేస్తారనే గ్యారెంటీ లేదని, జనాన్ని చూసి విజయ్ మోసపోకూడదన్నారు.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ(సోమవారం) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
తమిళనాడు బీజేపీలో అంతర్గత కలహాలకు చెక్ పెట్టి కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్షా రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించేందుకు అమిత్షాతో రాష్ట్ర బీజేపీ నేతలు న్యూఢిల్లీలో బుధవారం భేటీ అయ్యారు.
క్రీడాకారులు ఓటమిచెందితే క్రుంగి పోకూడదని, విజయం కోసం తీవ్రంగా పోరాడాలని, చివరకు ఓటములే విజయానికి సోపానాలవుతాయని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. పుదుకోట సమీపం కీరనూరు వద్ద గన్ షూటింగ్ పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు.
బీజేపీ ఎవరినీ మోసం చేసే పార్టీ కాదని, అలాగని మోసపోయే పార్టీ కాదని బీజేపీ నేత అన్నామలై తెలిపారు. కోయంబత్తూర్ నుంచి నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... మా పార్టీకి ఒక లక్షణం ఉందని, మేము ఎవరినీ ఓడించమని, ఏ పార్టీని కిందకు నెట్టి ఎదగాలని కోరుకోమన్నారు.
కాంగ్రెస్కు ఊపిరిలూదిన కామరాజర్ను డీఎంకే నేతలు అవమానించినందుకు నిరసనగా, కనీస గౌరవం కోసమైనా ఆ కూటమి నుంచి వైదొలగాలని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై సూచించారు. నగరంలో గురువారం అన్నామలై మీడియాతో మాట్లాడుతూ... సమర్ధవంతమైన పాలకుడు కామరాజర్ ఓటమికి డీఎంకే ప్రధాన కారణమన్నారు.
అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)తో ఆది నుంచి ఎడమొహం పెడమొహంగా ఉండే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై.. తాజాగా ఆయనకు షాకిచ్చారు. ఎన్నికల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే ప్రసక్తే లేదని ఈపీఎస్ చెబుతుండగా.. ‘అవునవును.. సంకీర్ణ ప్రభుత్వం కాదు, వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’ అంటూ అన్నామలై వ్యాఖ్యానించారు.
బీజేపీ రాష మాజీ అధ్యక్షుడు అన్నామలై సంచలన ఆరోపణలు చేశారు. అన్నా విశ్వవిద్యాలయంలో జరిగిన అత్యాచారం కేసుతో కోట్టూరుపురం డీఎంకే స్థానిక నాయకుడు షణ్ముగంకు, ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యంకు సంబంధాలున్నాయని అన్నామలై ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే..
వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అన్నామలై, మందకృష్ణ మాదిగ, స్మృతి ఇరానీ వంటి పేర్లు చర్చల్లో ఉన్నాయి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న కె.అన్నామలై హిమాలయాలకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ బాబా గుహలో ఆయన ధ్యానం మొదలుపెట్టారు. గత రెండు రోజుల క్రితమే ఆయన బీజేపీ రాష్ట చీఫ్ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.