Home » Lok Sabha Polls 2024
లోక్సభ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు సమయంలో పెద్దఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయని ‘ఓట్ ఫర్ డెమోక్రసీ’ సంస్థ నివేదిక ఆరోపించింది.
లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎంపీ గౌరవ్ గొగోయ్కు ఆ పార్టీ మరోసారి అవకాశమిచ్చింది. చీఫ్ విప్గా సీనియర్ నేత కొడికున్నిల్ సురేశ్, విప్లుగా మాణిక్కం ఠాగూర్, మహమ్మద్ జావేద్లను నియమించింది.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాన పీఠమెక్కి నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మోదీ పాలనపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
గతంలో బీజేపీ, ఒడిశాలోని బీజేడీ పార్టీలు సహజీవనం చేశాయి. కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. బీజేడీతో సంబంధాలు తెంపుకొని.. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే రంగంలోకి..
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం భారత్ చేరుకున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లా ప్రధాని హసీనాకు కేంద్ర సహాయ మంత్రి కృతివర్ధన్ సింగ్ స్వాగతం పలికారు.
ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ అధికారాన్ని అందుకున్నారు. ఆ క్రమంలో త్వరలో జమ్ము కాశ్మీర్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
సార్వత్రిక ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్లో బీజేపీ కేడర్పై అధికార టీఎంసీ శ్రేణులు వరుసగా దాడులకు తెగబడ్డాయి. ఈ దాడులపై బీజేపీ అగ్రనాయకత్వం నలుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ విచారణ కమిటి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుంది. ఆ క్రమంలో విచారణ బృందం ఎదుట బీజేపీ కేడర్ మంగళవారం ఆందోళనకు దిగింది.
ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి ఎన్నికల బరిలో దిగతుండడం తనకు సంతోషాన్ని కలిగించిందని ఆమె భర్త రాబర్ట్ వాద్రా వెల్లడించారు. పార్టీ తరఫున ప్రచారం చేయడమే కాదు.. ప్రియాంక పార్లమెంట్లో ఉండాలని స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ రోజు వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యాటనలో భాగంగా సాయంత్రం 4.00 గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్కు ఆయన చేరుకుంటారు. అనంతరం వారణాసిలో ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద లబ్దిదారులకు 17 విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.
మోదీ ప్రభుత్వం తాజాగా కొలువు తీరింది. కేబినెట్ మంత్రులంతా బాధ్యతలు స్వీకరించారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక ఒక్కటే ఇక మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పదవి.. ఏ పార్టీ వారిని వరించనుందనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.