Home » Lok Sabha Polls 2024
PM Narendra Modi Pileru Public Meeting Live Updates: ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి దూకుడుగా ప్రచారం చేస్తోంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీనే ఏపీలో వరుసగా పర్యటిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా పీలేరు నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో
మే 13న ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. ఏపీలోని రాజకీయ పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. పార్టీ పెద్దలు సైతం రంగంలోకి దిగి.. తమ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం..
Telangana: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నయా నాటకాలకు తెర లేపుతున్నారని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రఘు నందన్ రావు దుబ్బాకలో ఓడిపోతే కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోలేదా అని అన్నారు. పోలీసులతో డబ్బులు పంచి గెలిచినందుకు కేసీఆర్కు సిగ్గు ఉండాలంటూ వ్యాఖ్యలు చేశారు. వెంకట్ రాంరెడ్డి ఎన్ని కట్టలు కట్టించినందుకు మెదక్ సీటు ఇచ్చావ్ కేసీఆర్ అని నిలదీశారు.
ఏపీలో ఎన్నికలకు సరిగ్గా ఐదు రోజులు సమయం మాత్రమే ఉంది. గెలుపు మాదేనంటూ ఎన్డీయే కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. వికసిత ఆంధ్రప్రదేశ్ నినాదంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు.. మరోవైపు అధికార వైసీపీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతం టార్గెట్ చేస్తోంది. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణక్షేత్రంలో ఎన్డీయే కూటమి విజయవకాశాలు ఎలా ఉన్నాయి. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం వలన తెలుగుదేశం, జనసేన జోడికి లాభమా.. నష్టమా..
వచ్చే పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మీట్ ది ప్రెస్లో కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జూన్ 5 న 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారన్నారు. బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్లోకి వస్తామని తనను సంప్రదించారన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, లోక్ సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ల గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ పరిస్థితి గురించి వెంకట్ రెడ్డి ప్రస్తావించారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తోందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బండి సంజయ్ గెలవడం పక్కా అని స్పష్టం చేశారు. వేములవాడలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.
దేశంలో ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు రాహుల్గాంధీకి అగ్నిపరీక్షగా మారాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించనప్పటికీ.. కాంగ్రెస్ నాయకులు ఎక్కువమంది రాహుల్ ప్రధాని కావాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే రాహుల్ ప్రధాని కావాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్పై మంత్రి బూడి ముత్యాల నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. నేడు ముత్యాల నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎన్నికల సంఘం నుంచి ఒత్తిళ్లు తెచ్చి తనపై అక్రమంగా కేసులు బనాయించాలని చూస్తున్నారన్నారు. నేర చరిత్ర, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి సీఎం రమేష్ అని ఆరోపించారు. వాస్తవాలను వక్రీకరించి పోలీస్ యంత్రాంగం కూడా సీఎం రమేష్కు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు.
ఢిల్లీలో అధికారంలోకి రావాలంటే యూపీలో గెలవాలి. ఎవరిని అడిగినా ఇదే చెబుతారు. అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ ఎక్కువు సీట్లు గెలిస్తే ఆ పార్టీ కేంద్రంలో అధికారానికి దగ్గరవుతుందనేది వాస్తవం. దీంతో ఈ ఎన్నికల్లో యూపీలో సత్తా చాటేందుకు ఎన్డీయే, ఇండియా కూటములు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలుండగా.. మూడు విడతల పోలింగ్ ముగిసింది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్లో గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గడం రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతున్నాయి.