ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yuvagalam: యువగళం సభకు పవన్ రావట్లేదు.. అచ్చెన్నాయుడు ప్రకటన

ABN, Publish Date - Dec 16 , 2023 | 03:38 PM

ఏపీలోని భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలోని భూమాత లేఅవుట్‌లో ఈ నెల 20వ తేదీన నిర్వహించే యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) రావడం లేదని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ( Kinjarapu Atchannaidu ) స్పష్టం చేశారు.

అమరావతి: ఏపీలోని భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలోని భూమాత లేఅవుట్‌లో ఈ నెల 20వ తేదీన నిర్వహించే యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) రావడం లేదని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ( Kinjarapu Atchannaidu ) స్పష్టం చేశారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘20వ తేదీన పోలిపల్లి గ్రామంలో యువగళం పాదయాత్ర ముగింపు సభ జరుగుతుంది. ఆ సభకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. నారా లోకేష్ పాల్గొంటారు. ఈ సభకి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల మంది కార్యకర్తలు హాజరుకానున్నారు. ఈ సభకి 16 కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ సభకి 6 లక్షలు మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నాం. వైసీపీ కౌట్ డౌన్ ప్రారంభమైంది. వైసీపీలోని అనేకమంది టీడీపీ పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు. ఇది యువగళంలో భాగంగానే జరుగుతుంది. ఈ మధ్య చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో మ్యానిఫెస్టో సిద్ధం కాకపోవడంతో ఈ సభకి పవన్ కళ్యాణ్ హాజరుకావడం లేదు. త్వరలో పూర్తి మ్యానిఫెస్టో సిద్ధమైన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యలో భారీ సభ నిర్వహిస్తాం. జగన్మోహన్‌రెడ్డిని ప్రజలు ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారు’’ అని అచ్చెన్నాయుడు ఎద్దేవ చేశారు.

Updated Date - Dec 16 , 2023 | 03:42 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising