Home » YuvaGalam
కాకినాడ: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 217వ రోజు యువగళం పాదయాత్ర సోమవారం శీలంవారిపాకలు జంక్షన్ నుంచి ప్రారంభం కానుంది. యువగళం యాత్రకు పల్లెలకు పల్లెలు కదిలొస్తున్నాయి. ఎటు చూసినా జనమే.. అడుగుతీసి అడుగువేయలేనతంగా జనం కదిలొస్తున్నారు.
పిఠాపురం ఉప్పాడ సెంటర్లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) బహిరంగ సభ రద్దు అయింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గొంతు నొప్పి తీవ్రంగా ఉండడంతో లోకేష్ బహిరంగ రద్దు చేసుకున్నారు.
Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా కాకినాడలో లోకేష్ను దివ్యాంగుల జేఏసీ ప్రతినిధులు కలిసి సమస్యలు చెప్పుకున్నారు.
నారా లోకేష్ ( Nara Lokesh ) యువగళం ( Yuva Galam ) పున: ప్రారంభంతో జగన్ బ్యాచ్కి భయం మొదలైందని TNSF రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ( Pranav Gopal ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నారా లోకేశ్ పాదయాత్ర చేస్తుండడంతో విజయసాయిరెడ్డి భయపడి ఎక్స్లో కారుకూతలు కూస్తున్నారని ప్రణవ్ గోపాల్ మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) పాదయాత్ర 211వ రోజు పూర్తయింది. ఇప్పటివరకు లోకేశ్ 2886.3 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేశారు. మంగళవారం నాడు 18.5 కి.మీలను లోకేశ్ నడిచారు. ముమ్మిడివరం విడిది కేంద్రంలో లోకేశ్ ఈరోజు రాత్రి బస చేయనున్నారు.
Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం పేరూరు క్యాంప్ సైట్ నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ను కోనసీమజిల్లా ఆక్వా రైతులు కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరిస్తామని యువనేత హామీ ఇచ్చారు. జగన్ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. సోమవారం ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను యువనేత మొదలుపెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ పాదయాత్రకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు బెయిల్పై బయటకు వచ్చారు.
నేటి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పున: ప్రారంభం కానుంది. నేటి ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి ఉదయం 10.19 గంటలకు లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకూ 209 రోజుల పాటు 2852.4 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
సోమవారం (రేపు) నుంచి పున:ప్రారంభం కానున్న టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శిన నారా లోకేశ్ (Nara Lokesh) యువగళం (Yuvagalam) పాదయాత్రకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి
ఈ నెల 24వ తేదీ నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పున: ప్రారంభం కానుంది. విశాఖలో పాదయాత్రను ముగించే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో సెప్టెంబర్ 9వ తేదీన యువగళం పాదయాత్ర నిలిచిపోయింది.