కొత్త బిల్లులో గాంధీ పేరు తొలగింపుపై దుమారం
ABN, Publish Date - Dec 21 , 2025 | 07:36 AM
ఉపాధి హామీ పథకమైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై బుల్జోజర్ నడిపారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: గ్రామీణ నిరుపేదలకు పని కల్పించడంలో భాగంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అయితే.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దీన్ని రద్దు చేసి, 'గాంధీ' పేరు లేకుండా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ జీవికా మిషన్(గ్రామీణ్) పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. దీంతో కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. పేరు మార్పుపై ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాథి హామీ పథకంపై బుల్జోజర్ నడిపారని ఆమె ఆరోపించారు.
ఇవీ చదవండి:
ఉపాధి హామీ పథకంపై బుల్డోజర్.. సోనియాగాంధీ ఫైర్
మేమిద్దరం వెళ్తాం.. ఢిల్లీ పర్యటనపై డీకే
Updated Date - Dec 21 , 2025 | 08:00 AM