మొదలైన మొంథా ముప్పు..
ABN, Publish Date - Oct 27 , 2025 | 10:19 AM
ఉత్తరకోస్తా, ఉభయగోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి. తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
అమరావతి, అక్టోబర్ 27: మొంథా తుపాన్ ప్రభావంతో నేటి (సోమవారం) నుంచి మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. నేడు కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కుంభవృష్టిగా, కోస్తాలోని మిగిలిన జిల్లాలైన రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా.. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
రేపు (మంగళవారం) ఉత్తరకోస్తా, ఉభయగోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి. తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని విధాలుగా ఎదుర్కునేందుకు సిద్ధమైంది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ముంచుకొస్తున్న మొంథా.. మూడు రోజులు సెలవులు
కార్తీక మాసం మొదటి సోమవారం.. పిఠాపురం పాదగయ క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం
Read latest AP News And Telugu News
Updated Date - Oct 27 , 2025 | 05:13 PM