ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Khammam: ఏసీబీకి చిక్కిన ఖమ్మం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌

ABN, Publish Date - May 27 , 2025 | 04:29 AM

గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం సబ్‌ రిజిస్టార్‌ జెక్కి అరుణ ఏసీబీకి చిక్కారు.

  • గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌కు రూ.50 వేలు డిమాండ్‌

  • చేసిన అధికారి.. 30 వేలకు ఒప్పందం

  • డాక్యుమెంట్‌ రైటర్‌ ద్వారా లంచం

  • డబ్బులు తీసుకుంటుండగా పట్టివేత

ఖమ్మం, మే 26 (ఆంధ్రజ్యోతి): గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం సబ్‌ రిజిస్టార్‌ జెక్కి అరుణ ఏసీబీకి చిక్కారు. ఖమ్మం రూరల్‌ మండలం తల్లంపాడు గ్రామ రెవెన్యూ పరిధిలోని ఓ సర్వేనంబరులో శ్రీనివాస్‌ అనే వ్యక్తి తన పేరిట ఉన్న 2,700 గజాల స్థలాన్ని తన కుమారుడి పేరిట గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు చలానా తీశారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ చేసే క్రమంలో సబ్‌ రిజిస్ట్రార్‌ అరుణ వారిని రూ.50 వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


దీంతో శ్రీనివాస్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం దరఖాస్తుదారుడు సబ్‌రిజిస్ట్రార్‌తో బేరమాడి రూ.30వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ నగదును డాక్యుమెంట్‌ రైటర్‌ పుచ్చకాయల వెంకటేశ్‌ ద్వారా తనకు అందజేయాలని ఆమె చెప్పారు. ఈ క్రమంలో సోమవారం రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్‌ రైటర్‌ ద్వారా నగదు తీసుకుంటుండగా ఇద్దరినీ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీనిపై విచారణ జరుగుతోందని ఏసీబీ డీఎస్పీ వై.రమేష్‌ తెలిపారు.


Also Read:

సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..

సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..

For More Health News and Telugu News..

Updated Date - May 27 , 2025 | 04:29 AM