ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ponguleti: కేంద్రం ఇళ్లు ఇచ్చినా ఇవ్వకున్నా సంతోషమే..!

ABN, Publish Date - Mar 16 , 2025 | 04:45 AM

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద కేంద్రం రాష్ట్రానికి ఇళ్లు ఇస్తే సంతోషమని.. ఇవ్వకపోయినా డబుల్‌ సంతోషమని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.

  • ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంతైనా భరిస్తాం

  • ‘ఆంధ్రజ్యోతి’తో మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద కేంద్రం రాష్ట్రానికి ఇళ్లు ఇస్తే సంతోషమని.. ఇవ్వకపోయినా డబుల్‌ సంతోషమని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో మంత్రిని ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన అంశంపై మాట్లాడారు. కేంద్రం ఇళ్లను ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని చెప్పారు. ఈ విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేసేది లేదన్నారు. పేదల కోసం ఎంత భారమైనా భరిస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Mar 16 , 2025 | 04:45 AM