Home » Ponguleti Srinivasa Reddy
ఖమ్మం సీటుపై మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన వియ్యంకుడు, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్రెడ్డి కుమారుడు రఘురామరెడ్డిని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్ఠానం నిర్ణయించింది. ఖమ్మం సీటుకు
చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద నలుగుతున్న మూడు స్థానాలపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేటికీ పెండింగ్లో పెట్టింది. ఆయా స్థానాల్లో కీలక నేతలు తమ వారికి కావాలంటే తమ వారికి కావాలంటూ పట్టుబట్టి కూర్చున్నారు.
ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థిపై ఉత్కంఠత కొనసాగుతుంది. ఈ ఎన్నికల బరిలో దిగేందుకు పార్టీలోని పలువురు నాయకులు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాజాగా ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.
ఖమ్మం లోక్సభ టికెట్ పంచాయతీ బెంగుళూరు చేరింది. ఖమ్మం సీటు విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం సీటు విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి సీటు కావాలని పట్టుబడుతున్నారు. తన భార్య నందినికి కాకపోతే రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబడుతున్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చరమగీతం పాడాలని కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం వైరా నియోజకవర్గ కేంద్రంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కేసీఆర్ నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్నదని.. ఆ పరిస్థితుల్లో నీటిని మొత్తం వేస్ట్గా దిగువ ప్రాంతాలకు వదిలారన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే నీటి కొరత ఏర్పడిందని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్ (Congress) తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం నాడు పరిశీలించారు.
తాము ఇంకా గేట్లు తెరవలేదని.. తెరిస్తే బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీల్లో నేతలు ఎవరూ ఉండరని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ (Congress) లోకి రమ్మని తాము ఎవరిని అడగటం లేదని.. స్వచ్ఛందంగా నేతలే తమ పార్టీలో చేరుతామని వస్తున్నారని వివరించారు. గురువారం నాడు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
విధ్వంసకర పాలన నుంచి ప్రజా పాలనలోకి వచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెడుతూ లక్ష్యం దిశగా పనిచేస్తున్నామని చెప్పారు.
Telangana: మరికొద్ది గంటల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రాబోతోందని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం కూసుమంచిలో సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వేసవికాలంలోనే శంకుస్థాపన చేసిన రోడ్లు పూర్తి చేయాలన్నారు. అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు.