Home » Ponguleti Srinivasa Reddy
లే-అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) పెండింగ్ దరఖాస్తులకు త్వరలోనే మోక్షం లభించనుంది. దరఖాస్తుల పరిష్కారానికి జిల్లాకో బృందాన్ని ప్రత్యేకంగా నియమించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 బృందాలు ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులను పరిశీలించనున్నాయి.
తెలంగాణలో మళ్లీ లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(LRS)ను అమల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మీడియాకు కీలక ప్రకటన జారీ చేసింది. ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో విధివిధానాలు ఖరారు కోసం మంత్రులు మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఇతర ఉన్నతాధికారులతోసమీక్షా సమావేశం నిర్వహించారు
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ మోసపూరిత బ్యాంకు గ్యారంటీలతో వందల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు దక్కించుకుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సంచలన ఆరోపణ చేశారు.
తెలంగాణ, ఏపీ పరిధిలో 16 వేల ఎకరాల ఆయుకట్టు కలిగిన పెదవాగు ప్రాజెక్టుకు తక్షణ మరమ్మతులు చేసి ఈ సీజన్లోనే రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్టు రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
కేసీఆర్ సర్కార్లో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ఆరోపించారు. జాతీయ పార్టీ పేరుతో రాష్ట్రాలతో గొడవలు పెట్టుకుందని విమర్శించారు.
రూరల్ మండలం తనగంపాడు(Thanagampadu) పత్తి చేలల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) పర్యటించారు. ఈ సందర్భంగా మహిళా రైతు కూలీలను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తు్న్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆయన ఆరా తీశారు.
రైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసా పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాలను సాధించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఖజానాను నింపేందుకు ప్రతి విభాగం కృషి చేయాలన్నారు.
రైతు భరోసా అమలు విధివిధానాలపై రైతుల నుంచి సలహాలు, సూచనల కోసం ఉమ్మడి పది జిల్లాల్లో నిర్వహించ తలపెట్టిన వర్క్షాప్ కార్యక్రమానికి ప్రభుత్వం కదిలింది. బుధవారం తొలి వర్క్షా్పను ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించారు.