Home » Ponguleti Srinivasa Reddy
ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G 2.0) కింద తెలంగాణ రాష్ట్రానికి సమగ్ర ప్రాతిపదికన ఒకేసారి 11,56,915 ఇళ్లను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
నిషేధిత భూములపై ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మాటిచ్చారు.
తెలంగాణ వ్యాప్తంగా గత పాలకులు ఆర్భాటంగా అనేక డివిజన్లు, జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారని.. ఎక్కడ కూడా ఆఫీసులు, ఇతరత్రా సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో 'ధరణి' పోర్టల్ వేదికగా జరిగిన భూ అక్రమాలపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో దృష్టి సారించిందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలకు ఆగస్టు చివరి వారంలో శ్రీకారం చుడతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. క్యూర్లో ఇందిరమ్మ టవర్స్ టెండర్ ప్రక్రియ ప్రారంభం చేస్తామన్నారు.
గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల మేర అప్పులు చేసిందని, పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు ఆధార్ ఒక్కటే సరిపోతుందని, ఇతర పత్రాలు అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హతలు, దరఖాస్తు విధానంపై స్పష్టత ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల ప్రక్రియపై మంత్రి కీలక వివరాలు వెల్లడించారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్లు విక్రయిస్తున్నారన్న ప్రచారంలో అవాస్తవం లేదని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ టవర్స్పై బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
క్యూర్ పరిధిలో ఫ్లాట్ల కోసం రేపటి నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. మీ సేవ, వాట్సాప్, వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం కట్టారని.. ఆ ప్రాజెక్టు పేరుతో నిధులు మెక్కారని ఎద్దేవా చేశారు.