Pashamylaram: పాశమైలారం ఘటన దురదృష్టకరం
ABN, Publish Date - Jul 01 , 2025 | 06:06 PM
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఫార్మా కంపెనీలో పేలుడు ఘటన దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.
సంగారెడ్డి, జులై 01: పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన అని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 48 మంది మృతదేహాలు సంఘటన స్థలంలో లభ్యమయ్యాయని చెప్పారు. ఇంకా 11 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉందన్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలో ఘటన స్థలాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావుతో కలిసి ఆయన సందర్శించారు.
శిధిలాల కింద మృతదేహాల కోసం పోలీస్ జాగిలాలను వినియోగించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన విజ్జప్తి చేశారు. చనిపోయిన కుటుంబ సభ్యులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతానంటే వారికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదంటూ విలేకర్లు అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాస్తా ఘాటుగా సమాధానమిచ్చారు.
ఇవి కూడా చదవండి:
బనకచర్లపై తమ వాదనతో ఏకీభవించిన కేంద్రం
సినీ నటి పాకీజాకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం
For More Telangana News and Telugu News
Updated Date - Jul 01 , 2025 | 06:07 PM