Kishan Reddy: ఆపరేషన్ సిందూర్ భారత నిబద్దతకు నిదర్శనం
ABN, Publish Date - May 08 , 2025 | 04:42 AM
పహల్గాంలో అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రశంసించారు.
హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి): పహల్గాంలో అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రశంసించారు. ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిపిన దాడి ఉగ్రవాద నిర్మూలనలో భారత నిబద్దతకు నిదర్శనమన్నారు. పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని, తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే క్రమంలో దేశ రక్షణకు ఇది కీలకమైన అడుగు అని పేర్కొన్నారు.
Updated Date - May 08 , 2025 | 04:42 AM